రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పాలన నీ.ఓర్చుకోలేక, ప్రజలు జగన్ పట్ల చూపిస్తున్న ఆదరణ చెడగొట్టడానికి టీడీపీ రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తూ ఉందని వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఆరోపించారు.
వ్యాప్తంగా 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగిందని స్పష్టం చేశారు.పార్టీలకు.
ప్రాంతాలకు, కులాలకు, మతాలకు అతీతంగా పాలన అందిస్తున్నట్లు అవంతి శ్రీనివాస్ అన్నారు.ఈ క్రమంలో జగన్ ప్రభుత్వం ఎటువంటి మంచి పని చేపడుతున్న గాని.
న్యాయస్థానాలను ఆశ్రయించి.విపక్షాలు అడ్డుకుంటున్నాయని స్పష్టం చేశారు.
రాజకీయాలు చేయాలనుకుంటే మనం మనం చూసుకోవాలి.అంతేగాని ప్రభుత్వం…ప్రజలకు చేపడుతున్న మంచి పనులను అడ్డుకోవడం ఏమిటి అని ప్రశ్నించారు.రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ విషయంలో ఏపీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు.ఈ విషయంలో ఎవరు తప్పు చేసినా కఠినంగా వ్యవహరించాలని పోలీసు వ్యవస్థకు సీఎం జగన్ కీలక ఆదేశాలు ఇవ్వడం జరిగింది.ప్రభుత్వంలో ఏదైనా లోపాలు ఉంటే.మీడియా ముందు తెలపాలని … సభ్యతా సంస్కారాలతో విమర్శించండి అని హితవు పలికారు.కేవలం రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య సృష్టించడానికే.టీడీపీ నాయకులు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని తాజాగా పట్టాభి చేసిన వ్యాఖ్యలపై అవంతి శ్రీనివాస్ కౌంటర్ కామెంట్ చేశారు.