ఇప్పుడెలా గవర్నర్‌ను కలిశావు బాబు?

ఏపీ మాజీ మంత్రి, మాజీ స్పీకర్‌ తెలుగు దేశం పార్టీ సీనియర్‌ నాయకుడు కోడెల శివ ప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే.ఆయన ఆత్మహత్యకు రాజకీయ వేదింపులే కారణం అంటూ తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

 Ycp Minister Botsa Satyanarayana Comments On Chandrababu Naidu-TeluguStop.com

తాజాగా ఏపీ గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌కు చంద్రబాబు నాయుడు ఈ విషయమై ఫిర్యాదు చేయడం జరిగింది.బాబు గవర్నర్‌ను కలవడంపై వైకాపా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.

మంత్రి బొత్స మాట్లాడుతూ గతంలో గవర్నర్‌ వ్యవస్థను రద్దు చేయాలంటూ చిందులు తొక్కిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు గవర్నర్‌ను కలిసి ఎలా ఫిర్యాదు చేశారంటూ ప్రశ్నించాడు.ఇప్పుడు గవర్నర్‌ వ్యవస్థపై నమ్మకం వచ్చిందా అన్నాడు.

కోడెల చావును రాజకీయాల కోసం ఉపయోగించుకోవడం దారుణం.గవర్నర్‌ను ఏ మొహం పెట్టుకుని కలిశారు.

గతంలో చంద్రబాబు నాయుడు పలు సందర్బాల్లో సీబీఐపై కూడా విమర్శలు చేశాడు.మరి ఇప్పుడు ఎందుకు సీబీఐ విచారణ జరగాలని డిమాండ్‌ చేస్తున్నారని బొత్స ప్రశ్నించాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube