రాజమండ్రిలో ఆసక్తికర ఘట్టం.. వైసీపీకి షాకిచ్చిన టీడీపీ.. ?

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం.ఎందుకంటే నమ్మినట్లే నమ్మి వెన్ను పోట్లు పొడవడం, మనవారు అనుకున్న వారే పక్క పార్టీలో చేరి డిపాజిట్లు దక్కకుండా చేయడం మొదలగు ఇలాంటివన్ని ఇక్కడ సర్వసాధారణమే.
రాజకీయాల్లో తనవారు అంటూ ఎవరుండరని ఎన్నో సార్లు నిరూపించబడింది.ఇలాంటి కీలక ఘట్టమే ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకుంది.ఇకపోతే ప్రస్తుతం ఏపీలో వైసీపీ హవా కొనసాగుతుందని తెలిసిందే.కానీ రాజమండ్రిలో మాత్రం వైసీపీ నేతలు సొంత పార్టీకే షాకిచ్చారు.

 Rajahmundry Ycp Leaders Joined Tdp,rajahmundry, Ycp Cadre, Join Tdp, Mla Adiredd-TeluguStop.com

పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకోవడం ఆసక్తి కలిగిస్తోంది.రాజమండ్రి అర్బన్ టీడీపీ నేత, ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, ఆమె భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్ ల సమక్షంలో 150 మంది వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరినట్టు సమాచారం.

ఇక ఇలా పార్టీ మారిన వారంతా రాజమండ్రి నగరంలోని 14, 15వ వార్డులకు చెందినవారట.ఇక ఈ వలస నేతలందరికి టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

కాగా ఈ వలసల అంశం ప్రస్తుతం రాజకీయవర్గాల్లో చర్చగా మారిందట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube