మొన్నటి వరకు ఏపీలో ఫ్యాను గాలి బలంగా వీచినా….సైకిల్ స్పీడ్ పెంచడంతో పాటు అనేక ప్రజాకర్షక పథకాలు ప్రకటిస్తూ… మారుమూల పల్లెల నుంచి పట్టణాల వరకు పసుపు గాలి పెరిగేలా చూసుకున్నారు.
దీంతో ఫ్యాను పార్టీ కి గాలి సరిపోక… ఆ పార్టీ నేతలు ఉక్కబోతకు గురవుతున్నారు.తమ పార్టీకి అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో…ఈ విధంగా సైకిల్ పార్టీ స్పీడ్ పెంచడం మింగుడు పడడం లేదు.
ఏదో ఒక రకంగా టిడిపి సైకిల్ గాలి తగ్గి పెరిగేలా తక్షణం కొత్త పథకాలు దృష్టి పెట్టాలని ఆ పార్టీ అధినేత జగన్ భావిస్తున్నారు.ఇక టిడిపి విషయానికి వస్తే… పథకాలను ప్రకటించడమే కాదు.వాటిని ఎలా చేయాలో కూడా చూపిస్తున్నారు.ప్రజలకు చేరువయ్యే అనేక పథకాలను వినూత్నంగా ప్రవేశపెడుతూ… ఎన్నికల్లో గెలవడం తమ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు.
తాము ప్రకటిస్తామని అనుకున్న పథకాలను కూడా … టిడిపి ముందుగానే కాపీ కొట్టి అమలు చేస్తుండడంతో డైలమాలో పడిపోయాడు.పార్టీకి కొంత ఊపు తీసుకొచ్చిన నవరత్నాలు స్కీమును కాపీ కొడుతూ… టిడిపి అందులోని పథకాలను అమలు చేస్తోంది.
ఈ విషయాన్ని వైసిపి జీర్ణించుకోలేకపోతోంది.ఏదో ఒక రకంగా సైకిల్ పార్టీ స్పీడ్ తగ్గించి ఫ్యాను గాలి పెరిగేలా చూసుకుంటున్నారు.
ఇప్పటికే నిన్ను నమ్మం బాబు అంటూ… కొత్త తరహా ప్రచారానికి కూడా శ్రీకారం చుట్టారు.మొన్నటి వరకు ఏపీలో ఫ్యాను గాలి బలంగా వీయడంతో ఇక తమకు తిరుగే లేదు అనుకున్నారు.అయితే…అనూహ్యంగా… ఇలా టీడీపీ అనేక ప్రజాకర్షక పథకాలు ప్రకటిస్తూ… మారుమూల పల్లెల నుంచి పట్టణాల వరకు పసుపు గాలి పెరిగేలా చూసుకున్నారు.దీంతో ఫ్యాను పార్టీ కి గాలి సరిపోక ముచ్చెమటలు పట్టేస్తున్నాయి.
తమ పార్టీకి అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో ఈ విధంగా సైకిల్ పార్టీ స్పీడ్ పెంచడం మింగుడు పడడం లేదు.ఇక టిడిపి విషయానికి వస్తే… ప్రజాకర్షక పథకాలను ప్రకటించడమే కాదు…వాటిని ఎలా అమలు చేయాలో కూడా చేసి చూపిస్తున్నారు.అవి ఆర్ధికంగా భారం అయినా వారు మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడంలేదు.వృధాప్య పించాలను ఇప్పటికే రెట్టింపు చేశారు.వచ్చే నెల నుంచి వాటిని అమలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు.అలాగే… డ్వాక్రా మహిళలకు పదివేలు.ప్రకటించడం ఇవన్నీ టీడీపీ ఇమేజ్ ను బాగా పెంచాయనే చెప్పాలి.అందుకే ప్రస్తుతం టీడీపీ హుషారుగా కనిపిస్తుండగా… వైసీపీ ఆందోళనలో ఉన్నట్టు స్పష్టంగా అర్ధం అవుతోంది.