ఏపీలో త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.ఈ నేపధ్యంలో పంచాయతీ ఎన్నికల పై జరుగుతున్న వైసీపీ నేతల కీలక సమావేశంలో వర్గపోరు భగ్గుమందట.
కర్నూలు జిల్లా నందికొట్కూరులో జరుగుతున్న వైసీపీ పంచాయితీ గురించి తెలుసుకుంటే.వైసీపీ సర్పంచ్ అభ్యర్థుల ఎంపికలో ఈ విభేదాలు బయట పడినట్లు సమాచారం.
ఇక్కడ ఎమ్మెల్యే ఆర్థర్, నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ బైరెడ్డి సిద్దార్థరెడ్డి మధ్య గత కొంతకాలంగా కోల్డ్వార్ ఉందన్న విషయం తెలిసిందే.అయితే ఆ వివాదం కాస్త ముదిరి వీరి అనుచరులు బాహాబాహీకి దిగి, పరస్పరం కుర్చీలతో కొట్టుకునే స్దాయికి వెళ్లగా, అక్కడే ఉన్న మంత్రులు వారించినట్లు తెలుస్తుంది.
ఒకానొక దశలో ఎమ్మెల్యే ఆర్థర్ రాజీనామాకు కూడా సిద్ధపడటం అధికార పార్టీలో కలకలం రేపిందట.ఇలా రోజుకో పంచాయితీ పార్టీ ఇన్చార్జిల దగ్గరకు వెళ్లడంతో, ఈ ఆధిపత్య పోరు చివరికి ఎక్కడికి దారి తీస్తుందో అనే టెన్షన్ పార్టీ వర్గాల్లో మొదలైందట.