కరోనాతో వైసీపీ నేత యాండపల్లి రమేష్ మృతి

ఏపీలో కరోనా విజృంభిస్తోంది.రోజుకు వేలల్లో కేసులు నమోదవుతున్నాయి.

 Ap, West Godavari, Mla, Dead-TeluguStop.com

ఇప్పటివరకు కరోనా బారిన పడి మృత్యువాత పడిన వారి సంఖ్య అధికంగా ఉంది.పేద, మధ్య తరగతి కుటుంబాలతో పాటు ధనిక కుటుంబాలు సైతం కరోనా బారిన పడి చనిపోతున్నారు.

అధికారులు, డాక్టర్లు, పోలీసులు, ప్రజాప్రతినిధులకు ఈ మహమ్మారి విడిచిపెట్టడం లేదు.ఇటీవల ఏపీలో టీడీపీ నేత కరోనాతో మరణించగా.

తాజా ఏపీ మంత్రి అనుచరుడు, వైఎస్సార్ సీపీ నేత ఈ వైరస్ బారిన పడి చికిత్స పొందుతూ మరణించాడు.

పశ్చిమ గోదావరి జిల్లా చెందిన కొవ్వూరు ఏఎంసీ చైర్మన్ యాండపల్లి రమేష్ కరోనా బారిన పడి చనిపోయాడు.

గత కొంత కాలంగా కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయన ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించుకున్నాడు.రిపోర్టులలో పాజిటివ్ అని తేలడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరాడు.చికిత్స పొందుతూ శుక్రవారం ఆయన చనిపోయాడు.కొవ్వూరు నియోజకవర్గంతో మంత్రి తానేటి వనిత గెలుపులో రమేష్ కీలక పాత్ర పోషించాడు.

ప్రజానాయకుడిగా మంచి పేరును, ప్రశంసలను పొందాడు.సాయం కోరి వచ్చే ప్రతి ఒక్కరిని కాదనకుండా సాయం చేసే వాడు.

రమేష్ మరణవార్త విని మంత్రి తానేటి వనిత, పార్టీ నేతలు, కార్యకర్తలు సంతాపం వ్యక్తం చేశారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube