ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికలలో వైసీపీ తిరుగులేని విజయం సాధించిన సంగతి తెలిసిందే.ఏకంగా చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో అదే రీతిలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో వైసీపీ అభ్యర్ధులు గెలవటం ఏపీ రాజకీయాలలో సంచలనం సృష్టించింది.
ఈ ఎన్నికలతో తెలుగుదేశం పార్టీకి ఏపీలో కూడా భవిష్యత్తు లేకుండా పోయిందని .చంద్రబాబు నాయుడికి సొంత నియోజకవర్గంలో కూడా పట్టు లేకుండా పోయిందని టీడీపీ సీన్ అయి పోయిందని విమర్శలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి పరిషత్ ఎన్నికల్లో టీడీపీ నీ… ప్రజలు చిత్తుగా ఓడించాలని మీడియాతో పేర్కొన్నారు.ప్రజలు ఇచ్చిన తీర్పుతో తెలుగుదేశం పార్టీ నేతలు ఎంత గా మాట్లాడుతున్నారని ఎన్నికలను బహిష్కరించాలని చెప్పడం దారుణమని అన్నారు.
గతంలో తమిళనాడు రాష్ట్రంలో జయలలిత ఎన్నికలను బహిష్కరించినప్పుడు… అన్నాడీఎంకే గుర్తుపై ఆ పార్టీకి చెందిన నాయకులు ఎవరు పోటీ చేయలేదని తెలిపారు.కానీ ఏపీలో టీడీపీ పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసింది అని ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పే చంద్రబాబు డ్రామాలాడుతున్నారని… చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు డ్రామా అని ప్రజలు అర్థం చేసుకుంటున్నట్లు.
నారాయణస్వామి చెప్పుకొచ్చారు.