వైకాపా సీనియర్ నేత విజయసాయిరెడ్డి ఇటీవల దేవినేని ఉమ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు.తెదేపా నేత దేవినేని ఉమ ఏపీలో జగన్ ప్రభుత్వం తీసుకువస్తున్న రివర్స్ టెండరింగ్, జ్యుడిషియల్ కమీషన్, పోలవరం ప్రాజెక్ట్లు, ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పించిన విషయం తెల్సిందే.
దీనిపై స్పందించిన విజయ్సాయిరెడ్డి… కొద్దిరోజులు ఆగితే రివర్స్ టెండరింగ్, జ్యుడిషియల్ కమీషన్ ఫలితాలు ఎలా ఉంటాయో తెలుస్తాయని చెప్పుకొచ్చారు.
దేవినేని వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతూ తేదెపా ప్రభుత్వం హాయంలో మీ వేల కోట్ల దోపిడీ కూడా బయట పడుతుంది అంటూ తీవ్రంగా మండిపడ్డారు.
రాబోయే నాలుగేళ్లలో అన్ని ప్రాజెక్ట్లను పూర్తి చేస్తామని సీఎం జగన్ ఏనాడో మాట ఇచ్చారు కదా, ఏపీ అన్ని రంగాల్లో అభివృద్ది చెందడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పుకొచ్చారు.అంతేకాకుండా మేం ప్రజలకు జవాబుదారులం, పచ్చ దొంగలకు కాదు అంటూ విజయసాయిరెడ్డి చురకలు అంటించారు.