తుని ఘటన జరిగాక రాయలసీమ వారు హింసాత్మక చర్యలకు పాల్పడ్డారని ఆరోపణలు చేసిన చంద్రబాబు ఇప్పుడు ఇప్పుడెందుకు ప్రశాంతంగా ఉండే గోదావరి జిల్లాల్లోని వారిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని నిలదీశారు వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు
శుక్రవారం ఆయన వైకాపా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు చేస్తున్న అవినీతి కార్యక్రమాలను నిలదీస్తున్న ఛానళ్ల ్రపసారాలను అడ్డకోవటమంటే ‘ప్రజాస్వామ్యంలో మూలస్థంభంగా ఉన్న మీడియా గొంతు నొక్కడమే అని, ఇది ప్రజాస్వామ్యంపై దాడిగానే పరిగణించాలని వ్యాఖ్యానించారాయన.ప్రభుత్వ అక్రమాలను చూపెట్టే మీడియా ఛానళ్లను కట్ చేపేందుకు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పెద్ద కుట్ర చేస్తోందని ఆరోపించారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి రావటానికి అనేక తప్పుడు హామీలు ఇచ్చిందని, కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని మాయమాటలు చెప్పిన విషయం తెలిసిందేనని అన్నారు.అధికారం చేజిక్కించుకున్న చంద్రబాబును తమకు ఎందుకు రిజర్వేషన్లు కల్పించడం లేదంటూ కాపు జాతి నిలదీస్తున్న వైనాలను ప్రజలకు చూపించే మీడియాను అడ్డకుంటున్నారని, పోలీసులతో, అధికారులతో ఎక్కడికక్కడ అధికార దుర్వినియోగం చేయిస్తూ ఎంఎస్ ఓలను బెదిరించి సాక్షి, ఇతర చానళ్ల ప్రసారాలు నిలిపివేయించారని ఆయన ఆరోపించారు.
ఇచ్చిన హామీలు నిలుపుకోలేని మీరు ఎదురు దాడులకు దిగుతారా, హామీలపై నిలదీస్తూ దీక్షలు చేస్తే ఇళ్ల తలుపులు బద్దలు కొట్టి మరీ అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు అంబటి.
.