ఏపీ సీఎం జగన్పై పదే పదే విమర్శలు చేస్తున్న చంద్రబాబు నాయుడుపై వైకాపా నాయకుడు అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశాడు.తెలుగు దేశం పార్టీకి చెందిన నాయకులు పార్టీని వదిలేస్తున్న తరుణంలో చంద్రబాబు నాయుడు విపరీతమైన మానసిక ఆందోళనకు గురవుతున్నాడు.
ఆయన ఎట్టి పరిస్థితుల్లో ప్రజల్లో జగన్కు మంచి పేరు రాకుడదంటూ విమర్శలు గుప్పిస్తున్నాడు.చేస్తున్న ప్రతి పనిని కూడా విమర్శించడం చంద్రబాబుకే చెల్లిందని రాంబాబు ఎద్దేవ చేశాడు.
నేడు వైకాపా ప్రభుత్వం ప్రారంభించిన కంటి వెలుగు పథకంపై కూడా చంద్రబాబు నాయుడు విమర్శలు చేయడం సిగ్గు చేటు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.తన హయాంలో కంటి వెలుగును ప్రారంభించానని, గ్రామ సచ్చివాలయాలను తన హయాంలో ప్రారంభించానంటూ చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గతంలో వాటిని ప్రారంభించినట్లుగా కాగితాల్లో చూపించి డబ్బులు గుంజేసి ఉంటాడంటూ విమర్శించాడు.
చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా కూడా పనికి రాడంటూ రాంబాబు వ్యాఖ్యలు చేశాడు.