ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడ్డ విషయం తెల్సిందే.ఇక కరోనా విపత్తు నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అములో ఉంది.
దాంతో రోజు వారి పని కూలీలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.ఎంతో మంది తిండి లేక ఇబ్బందులు పడుతున్నారు.
ఈ నేపథ్యంలో కరోనా సాయం అంటూ వైకాపా నాయకులు ఇంటికి వెయ్యి చొప్పున ఇస్తున్నారు.అయితే అవి ప్రభుత్వం ఇస్తున్న సొమ్ముగా వారు చెప్పడం లేదంటూ బీజేపీ ఇంకా కమ్యూనిస్ట్ పార్టీలు ఆరోపిస్తున్నాయి.
తాజాగా ఏపీ ఎన్నికల అధికారి వద్దకు ఈ విషయమై ఫిర్యాదు చేయడం జరిగింది.దానిపై ఎన్నికల అధికారి స్పందిస్తూ ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులోనే ఉన్న కారణంగా ప్రభుత్వ వర్గాలు అధికారులు డబ్బులు ఇవ్వాలి తప్ప రాజకీయ నాయకులు డబ్బులు ఇవ్వొద్దు అంటూ ఆదేశించారు.
ఈ విషయమై కింది స్థాయి అధికారులు పర్యవేక్షించాలని, వైకాపా నాయకులు ఎవరైనా డబ్బులు పంచుతున్నట్లుగా గుర్తిస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు.ఈ సమయంలో రాజకీయం ఏంటో అంటూ వైకాపా నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.