వైసీపీ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.మంత్రివర్గ విస్తరణతో ఆ పార్టీలో అంతర్గ విభేదాలు బయటపడుతున్నాయి.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్కు మరోసారి మంత్రి పదవి దక్కపోవడం పట్ల ఆయన కాస్తా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.కొత్తగా మంత్రి ఎన్నికైన కాకాణి గోవర్ధన్ రెడ్డితో అనిల్ కుమార్కు కోల్డ్ వార్ నడుస్తోందని టాక్ వినిపిస్తోంది.
ఇటీవల మీడియా సమావేశంలో తనకు గోవర్ధన్ అన్న ఎలా సహకరించారో.అంతకు డబుల్ సహకరిస్తానని అనిల్ కుమార్ చెప్పడం ఒక్కసారిగా చర్చనీయాంశమైంది.
ఇప్పుడు నెల్లూరు జిల్లా రాజకీయాల్లోనూ ఇదే హాట్ టాపిక్.అదీ రాజకీయ ప్రత్యర్థుల మధ్య కాకుండా.అధికార వైసీపీలోనే ఈ చర్చ జరుగుతోంది.మంత్రి కాకాని గోవర్థన్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ యాదవ్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిల్లో ఏ ఇద్దరి మధ్య సరైన సఖ్యత లేదన్నది జిల్లా రాజకీయ వర్గాల్లో చాలా రోజులుగా వినిపిస్తున్న టాక్.
గతం గత: అనుకున్నారో.మరేదైనా రాజకీయ కారణమో కానీ ఇప్పుడు కోటంరెడ్డి, అనిల్ తమ విభేదాలను పక్కనబెట్టి ఒకటయ్యారు.
స్వయంగా అనిల్ యాదవ్ కోటంరెడ్డిని వెళ్లి కలవడం ఆసక్తిగా మారింది.
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శ్రీధరన్న నిర్వహిస్తున్న గడప గడపకు కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని అనిల్ పిలుపునిచ్చారు.
వచ్చే ఎన్నికల్లో మరోసారి ఘన విజయం సాధించి మూడోసారి విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.ఈ విషయంలో శ్రీధరన్నకు సంఘీభావం తెలిపేందుకే తాను ఆయనతో కలిసినట్లు తెలిపారు.
అనిల్ చెబుతున్నది ఎలా ఉన్నా.ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డితో ఆయన భేటీ కావడం వైసీపీ శ్రేణుల్లోనూ చర్చనీయాంశమయ్యింది.
జిల్లాలో మంత్రి కాకాని పెత్తనం చేయకుండా చెక్ పెట్టేందుకు అనిల్, శ్రీధర్ రెడ్డి కలిసి పనిచేయాలని నిర్ణయించుకుని ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది.మరి కొత్త మంత్రి కాకాని వీరితో రాజీ కుదుర్చుకుంటారో? కయ్యానికి కాలుదువ్వుతారో? వేచి చూడాల్సింది.పైకి ఏమీ లేదని వైసీపీ శ్రేణులు చెబుతున్నా.లోపల ఏదో జరుగుతోందన్న టాక్ వినిపిస్తోంది.మొత్తానికి ఈ వ్యవహారం నెల్లూరు జిల్లాలో రాజకీయ సెగలు రేపుతోంది.
నెల్లూరు ప్రజలను కలిసేందుకు మాజీ మంత్రి గడప గడపకు అనిల్ కార్యక్రమం నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఈ నెల 17న సాయంత్రం 5 గంటలకు నెల్లూరులో బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.సభను విజయవంతం చేయాలని తన అనుచరులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
అదేరోజు సాయంత్రం 5:30 గంటలకు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరు సిటీకి రానున్నారు.మంత్రికి స్వాగతం పలికేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు భారీ ఏర్పాటు చేస్తున్నాయి.ఈ నేపథ్యంలో ఒకే సమయంలో ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నేతల కార్యక్రమాలు జరగబోతుండడంతో నెల్లూరులో ఏం జరగుతోందనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
మరోవైపు అనిల్ కుమార్ యాదవ్ సజ్జాపురంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి గిరిధర్ రెడ్డితో సమావేశమైన విషయం తెలిసిందే.
వారు దాదాపు రెండు గంటలపాటు రహస్యంగా చర్చలు జరిపారు.వీరి భేటీపై పార్టీలో కూడా హాట్ టాపిక్గా మారింది.అదేవిధంగా ఇటీవల కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని అనిల్ కలిసినట్లు సమాచారం.ఈ నేపథ్యంలోనే నెల్లూరు వైఎస్సార్సీపీ పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్ మారాయి.