ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకీ సరికొత్త ట్విస్టుల తో నడుస్తున్నాయి.మొన్న చంద్రబాబు మీడియా సమావేశంలో కన్నీరు పెట్టుకోగా.
ఏపీ పాలిటిక్స్ చంద్రబాబు.ఏడుపు చుట్టూ తిరిగాయి.
అయితే ఇంతలోనే వైసీపీ ప్రభుత్వం.మూడు రాజధానులు విషయంలో వెనక్కి తగ్గి సమగ్రమైన.
స్పష్టమైన బిల్లు తీసుకొస్తున్నట్లు అసెంబ్లీలో సీఎం జగన్ పేర్కొనటం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.ఇదిలా ఉంటే ఇంతలోనే మరో సంచలన నిర్ణయం ఇక వైసీపీ ప్రభుత్వం రెడీ అయినట్టు సమాచారం.
విషయంలోకి వెళితే గతంలో శాసన మండలి రద్దు చేయాలని వైసీపీ ప్రభుత్వం… గతంలో అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టడం తెలిసిందే.
కాగా తాజాగా గతంలో శాసన మండలి విషయంలో రద్దు చేస్తూ తీసుకున్న తీర్మానాన్ని.
ఉపసంహరించుకోవడానికి రెడీ అయినట్లు సమాచారం.శాసనమండలి రద్దు తీర్మాణానికి ఉపసంహరించుకుని మరో తీర్మానాన్ని తీసుకొచ్చే ఆలోచనలో వైసిపి ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఉపసంహరణ తీర్మానం కాపీ అని కేంద్రానికి పంపించే ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ రాజకీయాల్లో టాక్ నడుస్తుంది.గతంలో శాసనమండలిలో టిడిపి పార్టీ సభ్యులు ఎక్కువగా ఉండటంతో వారి బలం ఎక్కువగా ఉండేది.
దీంతో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు అసెంబ్లీ లో పాస్ అయినా గాని శాసనమండలిలో కొన్ని కీలకమైనవి విగిపోయే పరిస్థితి ఉండేది.పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు తాజాగా శాసనమండలిలో కొత్త ఎమ్మెల్సీలు రావడంతో వైసీపీకి తిరుగు లేని బలం వచ్చింది.
దీంతో శాసన మండలి రద్దు నిర్ణయాన్ని వైసీపీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటున్నట్లు అర్థమవుతుంది.