సమయం లేదు మిత్రమా.శరణమా.
రణమా అన్న డైలాగ్ సినిమాల పరంగానే కాదండోయ్ ఏపీ రాజకీయాల్లోనూ బాగానే పనిచేస్తోంది.ఇక్కడ ఉన్న అన్ని పార్టీలకు ఇప్పుడు సమయం దగ్గర పడుతోంది.
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సీఎం సీటును కైవసం చేసుకోవాలనే తండ్లాట ఇరు పార్టీల్లోనూ బలంగా కనిపిస్తోంది.అటు వైసీపీ మరోసారి అధికారంలోకి రావాలని ఆరాటపడుతుంటే ఇటు టీడీపీ కూడా ఎలాగైనా గెలిచి అధికారంలోకి రావాలని ఆరాటపడుతోంది.
అన్ని ఉప ఎన్నికలు దాదాపు పూర్తయిపోవడంతో ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలమీదే అందరి దృష్టి పడుతోంది.
ఇప్పటికే చంద్రబాబు మళ్లీ అసెంబ్లీలో అడుగు పెట్టేది లేదంటూ శపథాలు కూడా చేసేస్తున్నారు.
ఇలాంటి సమయంలో మరోసారి తన పట్టును కాపాడుకునేందుకు జగన్ కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు.జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించి మరీ ప్రజల్లోకి వెళ్లి భారీ మెజార్టీతో గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు.
ఇప్పుడు చంద్రబాబు కూడా అలాంటి శపథమే చేసేయడంతో జగన్ అప్రమత్తం అయిపోయారు.అయితే పాదయాత్రల ద్వారా అధికారంలోకి వచ్చిన జగన్ ఆ తర్వాత ప్రజల్లో కనిపించట్లేదు.
దీంతో ఇప్పుడు మళ్లీ ప్రజల్లోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారంట.నిత్యం జనంతోనే ఉండాలని ఆయన ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది.ఇందులో భాగంగా జగన్ జిల్లాల్లో పర్యటించాలని ప్లాన్ చేసుకుంటున్నారు.ఈ క్రమంలోనే గతంలో ఇచ్చిన రావాలి జగన్ నినాదాన్ని మరోసారి వాడాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది.అప్పుడు రావాలి జగన్ నినాదాన్ని ఇప్పుడు మళ్లీ రావాలి జగన్ అంటూ కొత్తగా పిలుపునిస్తున్నారు.త్వరలోనే దీన్ని పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తోందని సమాచారం.
ఈ నినాదం మరి వైసీపీకి మరోసారి అధికారాన్ని కట్టబెడుతుందా లేక ఇంకెన్ని సార్లు అంటూ ప్రజల నుంచి విమర్శలు తెప్పిస్తుందా అనేది మాత్రం వేచి చూడాలి.