తాడిపత్రిలో వైసీపీ, టీడీపీ వర్గాల దాడులు! ఇద్దరు మృతి

ఎన్నికలు అంటేనే ఏపీలో శాంతిభద్రతల సమస్య ఎక్కువగా ఉంటుంది.ముఖ్యంగా రాయలసీమ ఫ్యాక్షన్ రాజకీయాలు ఎప్పుడు అక్కడి ప్రజలని ప్రశాంతంగా ఉంచవు.

 Ycp And Tdp Cadre Attack Each Other In Thadipatri-TeluguStop.com

దీంతో ఏపీ ఎన్నికలపై ఎన్నికల సంఘం ప్రత్యేక ద్రుష్టి పెట్టి పారా మిలటరీ దళాలని కూడా రంగంలోకి దించుతుంది.ఇదిలా ఉంటే తాజాగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపద్యంలో మరోసారి రాయలసీమలో, తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది.

అనంతపురం జిల్లా వీరాపురంలో వైసీపీ, టీడీపీ వర్గాలు బాహాబాహీ తలపడ్డాయి.197వ పోలింగ్‌ కేంద్రంలో టీడీపీ- వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.ఇరువర్గాల కార్యకర్తలు కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు.ఈ గొడవలో టీడీపీకి చెందిన ఇద్దరు కార్యకర్తలు మృతి చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు.ఇక ఈ పోలీసులు రంగంలోకి దిగడంతో కొంత వరకు పరిస్థితి సద్దుమణిగింది అని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube