ఎన్నికలు అంటేనే ఏపీలో శాంతిభద్రతల సమస్య ఎక్కువగా ఉంటుంది.ముఖ్యంగా రాయలసీమ ఫ్యాక్షన్ రాజకీయాలు ఎప్పుడు అక్కడి ప్రజలని ప్రశాంతంగా ఉంచవు.
దీంతో ఏపీ ఎన్నికలపై ఎన్నికల సంఘం ప్రత్యేక ద్రుష్టి పెట్టి పారా మిలటరీ దళాలని కూడా రంగంలోకి దించుతుంది.ఇదిలా ఉంటే తాజాగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపద్యంలో మరోసారి రాయలసీమలో, తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది.
అనంతపురం జిల్లా వీరాపురంలో వైసీపీ, టీడీపీ వర్గాలు బాహాబాహీ తలపడ్డాయి.197వ పోలింగ్ కేంద్రంలో టీడీపీ- వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.ఇరువర్గాల కార్యకర్తలు కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు.ఈ గొడవలో టీడీపీకి చెందిన ఇద్దరు కార్యకర్తలు మృతి చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు.ఇక ఈ పోలీసులు రంగంలోకి దిగడంతో కొంత వరకు పరిస్థితి సద్దుమణిగింది అని తెలుస్తుంది.