అనంతపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు సంబంధించిన అసభ్యకరమైన ఓ వీడియో గత కొద్ది రోజులుగా వైరల్ కావడంతో పాటు, అధికార పార్టీ ఇబ్బంది పడేలా ప్రతిపక్షాలకు అదే ఆయుధంగా మారి రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.అయితే ఈ వీడియో మార్నింగ్ చేశారని, తనపై కావాలని టిడిపి ఆ పార్టీ అనుకూల మీడియా దుష్ప్రచారం చేస్తోందని, దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తానని గోరంట్ల మాధవ్ మీడియా ముందుకు వచ్చి చెప్పుకున్నారు.
ఈ సందర్భంగా కమ్మ సామాజిక వర్గంపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు.దీనిపై అనంతపురంలో కమ్మ సామాజిక వర్గం కు చెందిన వారంతా గోరంట్ల మాధవ్ కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టగా, దీనికి కురుబ సామాజిక వర్గం వారు మాధవ్ కు అనుకూలంగా ఆందోళన కార్యక్రమం చేపట్టి… ఇదంతా కమ్మ సామాజిక వర్గానికి చెందిన మీడియా దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
ఇది కులం రంగు పులుముకుని మరింత రచ్చ అవుతున్న సమయంలోనే ఈ వ్యవహారంపై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.వైస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్త అనిత రెడ్డి తనపై టిడిపి, జనసేన పార్టీలకు చెందిన కొంతమంది సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని, మాధవ్ వీడియోలో తన ఫోటో పెట్టి మార్ఫింగ్ చేశారని, తనపై దుష్ప్రచారం చేస్తూ వేధిస్తున్నారని అనిత రెడ్డి ఆరోపించారు.
తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శ్రీ సత్య సాయి జిల్లా గాండ్లపెంట పోలీస్ స్టేషన్ లో ఆమె ఫిర్యాదు చేశారు.
గత నాలుగేళ్లుగా వైసిపి సోషల్ మీడియాలో స్వచ్ఛందంగా పనిచేస్తున్నానని, అప్పటి నుంచి టిడిపికి చెందిన కొంతమంది తనను టార్గెట్ చేశారని అనిత రెడ్డి ఫిర్యాదులు పేర్కొన్నారు.ఇదంతా లోకేష్ డైరెక్షన్ లో జరుగుతున్న కుట్ర గా అనిత రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఇదిలా ఉంటే గోరంట్ల మాధవ్ వీడియో కాల్ లో మాట్లాడింది వైసిపి కార్యకర్త అనిత రెడ్డి అంటూ సోషల్ మీడియాలో ఆమె ఫోటో వైరల్ అవుతుండడంతో అనిత రెడ్డి దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.