చిక్కోలు ముద్దు బిడ్డ టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి కుడిభుజంలా ఉన్నాడు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై ఎప్పటికప్పుడు విరుచుకుపడుతున్నాడు.
తనదైన శైలిలో విమర్శలు చేస్తు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలపై విరుచుకు పడ్డాడు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు సవాల్ విసిరాడు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గుంపులో గోవింద లాగా పార్లిమెంట్ లో వ్యవహరిస్తున్నారని విమర్శించారు.ప్రజలకు మభ్య పెట్టడానికి పార్లిమెట్ లో హడావిడి చేస్తున్నారని, కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఏ మాత్రం ప్రయత్నం చేయడం లేదని, వైస్ ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు చిత్తశుద్ధి లేదని ఆరోపించారు.
ఫోటోలు తీసుకోవడానికే హడావుడి చేస్తున్నట్లు కనిపిస్తుందని రామ్మోహన్ నాయుడు ఆరోపించారు.
అసలు విషయానికొస్తే విశాఖ స్టీల్ మేలుకోసం, స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం దీనిపై వైసీపీ ఎంపీలు, రాష్ట్ర మంత్రులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రాజీనామాలు చేస్తే ప్రత్యేక హోదా వస్తుంది అన్నారు మేము రాజీనామాలు చేస్తాం వైసీపీ చెందిన 22 మంది ఎంపీలు రాజీనామాలకు సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు.ఎంపీ రఘురామ రాజు పై అనర్హత వేటు వేయడానికి డ్రామా ఆడుతున్నారని ఈ రెండేళ్లలో ఏం చేశారని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
వైసీపీ నేతల విమర్శలకు మేం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని పార్లమెంట్లో చేస్తున్న పోరాటమే ప్రజలు గమనిస్తున్నారని నిరూపించుకోవాల్సిన అవసరం లేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత వైసీపీ పార్టీ నాయకులుపైనే ఉందన్నారు.