యూవీ క్రియేషన్స్ ని హోమ్ బ్యానర్ గా మార్చుకుంటున్న దర్శకుడు

విలేజ్ లో వినాయకుడు, కుదిరితే కప్పు కాఫీ సినిమాలకి నిర్మాతగా చేసి తరువాత దర్శకుడుగా టర్న్ తీసుకొని తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న వ్యక్తి మహి వి రాఘవ.దర్శకుడుగా పాఠశాల, ఆనందోబ్రహ్మ, యాత్ర సినిమాలతో మంచి కంటెంట్ బేస్ కథలని తెరపై ఆవిష్కరించిన దర్శకుడుగా మహి పేరు తెచ్చుకున్నాడు.

 Yatra Director Commits With Uv Creations, Tollywood, Telugu Cinema, South Cinema-TeluguStop.com

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పాదయాత్ర ఎలిమెంట్ తో యాత్ర సినిమాని తెరకెక్కించిన మహి ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ ఎన్నికలలో గెలవడానికి కూడా కొంత కారణం అయ్యాడని చెప్పాలి.ఇక జగన్ పాదయాత్రని కథాంశంగా తీసుకొని యాత్ర 2ని తెరకెక్కిస్తానని ఆ మధ్య ఈ దర్శకుడు చెప్పుకొచ్చాడు.

అయితే అది ఎంత వరకు వచ్చింది అనేది తెలియలేదు.అదే సమయంలో అల్లు అర్జున్ తో ఒకపొలిటికల్ డ్రామా కథని ప్లాన్ చేసినట్లు ఊహాగానాలు వినిపించాయి.

వాటిపై స్పష్టత రాలేదు.అలాగే నాగార్జునతో యాత్ర 2 చేస్తాడని ప్రచారం జరిగింది.

దానిలో కూడా వాస్తవం లేదని తేలిపోయింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం నెక్స్ట్ సినిమా ప్లాన్ చేస్తున్న మహి వి రాఘవ ఇప్పుడు బడా నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ తో ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తుంది.

త్రివిక్రమ్ హారికా హాసిని క్రియేషన్స్ ని హోమ్ బ్యానర్ గా మార్చుకున్నట్లు మహి వి రాఘవకి కూడా యూవీ క్రియేషన్స్ హోమ్ బ్యానర్ గా మారినట్లు టాక్ వినిపిస్తుంది.ఇకపై ఈ దర్శకుడు చేయబోయే అన్ని సినిమాలు యూవీ క్రియేషన్స్ బ్యానర్ లోనే తెరకెక్కుతాయని సమాచారం.

ముందుగా మహి ఈ బ్యానర్ లో ఓ మల్టీ స్టారర్ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది.దీనికి సంబంధించి త్వరలో అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు బోగట్టా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube