డార్లింగ్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.అతని ఇమేజ్ కూడా అన్ని భాషలకి విస్తరించింది.
ప్రభాస్ సినిమా అంటే భాషలకతీతంగా ప్రేక్షకులు నీరాజనాలు పడతారు.అలాంటి పాన్ ఇండియా స్టార్ తో సినిమా తీయాలంటే ఇప్పుడు బడ్జెట్ కూడా ఆ స్థాయిలోనే పెట్టుకోవాలి.
ఇప్పుడు హిందీ దర్శకులు కూడా తమ సినిమాలకి పాన్ ఇండియా ఫీలింగ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.గతంలో సౌత్ భాషలపై పెద్దగా దృష్టి పెట్టేవారు కాదు.
అయితే హిందీతో పాటు దేశ వ్యాప్తంగా ఇతర భాషల మార్కెట్ ని కూడా తెచ్చుకోవాలని పాన్ ఇండియా కథలపై దృష్టి పెట్టి సౌత్, నార్త్ కాంబినేషన్ లకి ప్రాధాన్యత ఇస్తున్నారు.గతంలో సౌత్ హీరోలని చిన్న చూపు చూసే హిందీ పరిశ్రమ ఇప్పుడు నెత్తిన పెట్టుకుంటుంది.
ఇదంతా కేవలం సౌత్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో తమ మార్కెట్ పరిధిని పెంచుకోవడమే. ఇదిలా ఉంటే డార్లింగ్ ప్రభాస్ ఇప్పుడు చేస్తున్న సినిమాలు అన్ని కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే ఉంటున్నాయి.
ఈ నేపధ్యంలో ధూమ్ సిరీస్ లో భాగంగా తెరకెక్కనున్న నాలుగో పార్ట్ ని పాన్ ఇండియా రేంజ్ లో ఆవిష్కరించాలని యష్ రాజ్ ఫిలిమ్స్ భావిస్తుంది.దీనికోసం హృతిక్ రోషన్ తో పాటు మరో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రని కూడా డిజైన్ చేసినట్లు తెలుస్తుంది.
దానికోసం డార్లింగ్ ప్రభాస్ ని సంప్రదిస్తున్నారని సమాచారం.గతంలో ఈ ప్రాజెక్ట్ విషయంపై చర్చ జరిగిన ప్రభాస్ డేట్స్ అడ్జస్ట్ కాలేక వదులుకున్నాడు.అయితే ఎలా అయినా ఈ సినిమాలో అతనితో నటింప జేయాలని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు.దానికోసం మళ్ళీ సంప్రదింపులు జరిపారని తెలుస్తుంది.
ప్రభాస్ ఉంటే ఇంటెర్నేషనల్ ఫ్లేవర్ యాడ్ అవుతుందని భావించి అతని డేట్స్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది.