టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సమంత ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం మనందరికీ తెలిసిందే.
అయితే గత కొద్ది రోజులుగా సమంత అనారోగ్యం కారణంగా సినిమాలకు సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న సమంత ఇటీవల సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తాను మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లుగా చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.
ఈ వార్త విన్న అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.సమంత అనారోగ్యం కారణంగా తాను నటించిన సినిమా ప్రమోషన్స్ లో కూడా పాల్గొనలేకపోయింది.
అయినప్పటికీ హాస్పిటల్ బెడ్ పై చికిత్స తీసుకుంటూనే అక్కడి నుంచి అభిమానులను సోషల్ మీడియా వేదిక సినిమా సక్సెస్ అయ్యేలా చూడండి అంటూ అభిమానులను వేడుకుంది.ఇది ఇలా ఉంటే సమంత నటించిన తాజా చిత్రం యశోద.
ఈ సినిమా ఇటీవలె విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ టాక్ ని చేసుకున్న విషయం తెలిసిందే.హరి హరీష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు.
ఇటీవల భారీ అంచనాల నడుమ నవంబర్ 11న విడుదలైన ఈ సినిమా పరవాలేదు అనిపించే విధంగా టాక్ ను తెచ్చుకుంది.అయితే ఈ సినిమాలో సమంత నటనపై ప్రేక్షకులు అభిమానులు సెలబ్రిటీలు స్పందిస్తూ ప్రశంసల వర్షం కురిపించినప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం ఈ సినిమా సక్సెస్ ను సాధించలేకపోయింది.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వార్త ఒకటి తెగ చక్కెరలు కొడుతోంది.అదేమిటంటే ఈ సినిమా విడుదల అయ్యి కనీసం రెండు వారాలు కూడా దాటకముందే అప్పుడే ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.కాగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో యశోద సినిమా స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.డిసెంబర్ రెండో వారంలో ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ విషయంపై ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.