ప్రముఖ బిగ్ బాస్ కంటెస్టెంట్లలో ఒకరైన యాషిక ఆనంద్ గత నెలలో ఒక యాక్సిడెంట్ చేయడం ద్వారా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.యాషిక ఆనంద్ చేసిన యాక్సిడెంట్ వల్ల ఆమె ఫ్రెండ్ అయిన పావని మృతి చెందారు.
ఈ యాక్సిడెంట్ వల్ల పావని తీవ్ర గాయాలపాలైన సంగతి తెలిసిందే.యాక్సిడెంట్ తర్వాత ఆస్పత్రిలో చేరిన యాషిక కోలుకుని తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేశారు.
మృతి చెందిన పావని గురించి యాషిక ఆనంద్ చేసిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.యాక్సిడెంట్ తర్వాత తాను ప్రస్తుతం ఏ విధంగా ఉన్నానో కూడా చెప్పలేకపోతున్నానని యాషిక అన్నారు.
లైఫ్ లాంగ్ ఈ యాక్సిడెంట్ కు సంబంధించిన గిల్టీ ఫీలింగ్ తనకు ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు.ఈ విషాదం విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెప్పాలో లేక దేవుడిని నిందించాలో తనకు అర్థం కావడం లేదని ఆమె అన్నారు.
తన స్నేహితురాలు పావనిని ప్రతి నిమిషం మిస్ అవుతున్నానని నన్ను పావని క్షమించాలని కోరుకుంటున్నానని యాషిక ఆనంద్ చెప్పుకొచ్చారు.పావని కుటుంబం విషాదకర పరిస్థితిలో ఉండటానికి కారణమైనందుకు తాను బాధ పడుతున్నానని ఆమె అన్నారు.తప్పు చేసినందుకు దోషిగా తనకు జీవితాంతం బాధ ఉంటుందని పావని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని ఆమె చెప్పుకొచ్చారు.
పావనితో ఉన్న జ్ఞాపకాలను తాను అస్సలు మరిచిపోలేనని ఆమె చెప్పుకొచ్చారు.పావని ఫ్యామిలీ తనను క్షమిస్తుందని ఆశిస్తున్నానని యాషిక అన్నారు.21 వసంతాలను పూర్తి చేసుకుని 22వ వసంతంలోకి అడుగు పెడుతున్న పావని తాను పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం లేదని అభిమానులు కూడా జరపవద్దని అన్నారు.నేడు యాషిక ఆనంద్ పుట్టినరోజు కావడం గమనార్హం.