కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ మూవీ ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.కన్నడ ఇండస్ట్రీ చరిత్రలో అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అదే స్థాయిలో కలెక్షన్స్ వర్షం కురిపించింది.
తెలుగు, హిందీ, తమిళంలో కూడా ఈ సినిమా సత్తా చాటింది.ఇక కన్నడ ఇండస్ట్రీలో అయితే మొదటి సారిగా వంద కోట్ల కలెక్షన్ మార్క్ ని ఈ సినిమా క్రాస్ చేసింది.
ఓవరాల్ గా ఈ సినిమా 250 కోట్ల వరకు కలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా వంద రోజులు పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా కలర్స్ కన్నడ చానల్ కేజీఎఫ్ ప్రీమియర్ షో ని తన చానల్ లో టెలికాస్ట్ చేయడానికి రెడీ అవుతుంది.ఇక ఈ రోజు సాయంత్రం ఏడు గంటలకి టెలికాస్ట్ అయ్యే ఈ సినిమా కోసం హీరో యష్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అదే టైంలో ఈ సినిమా టెలికాస్ట్ అయ్యే టైంలో ఏమైనా పవర్ కట్ చేస్తే మంగుళూర్ ఎలక్ట్రిసిటీ సప్లయ్ కంపెనీని తగలబెట్టేస్తామని సీరియస్ వార్నింగ్ ఇవ్వడం కలకలకం రేపింది.అయితే యష్ అభిమానులు ఇలా వార్నింగ్ ఇవ్వడం వెనుక తాజాగా జరుగుతున్నా రాజకీయ పరిణామాలు అని తెలుస్తుంది.