చిరంజీవి కెరియర్ లో దొంగమొగుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.హీరోయిన్ మాధవి భర్త స్థానంలో చిరంజీవి ఇంట్లోకి రావడం.
అక్కడ చేసే హంగామా వెరసి అవుట్ అండ్ అవుట్ కామెడీ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కింది.చిరంజీవి ఈ మూవీలో డ్యూయల్ రోల్ లో కనిపించి సందడి చేశాడు.
ఒక పాత్రలో దొంగగా మరో పాత్రలో బిజినెస్ మెన్ గా కనిపస్తాడు.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ అప్పట్లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
దొంగ మొగుడు సినిమా యండమూరి వీరేంద్రనాథ్ నల్లంచు తెల్లచీర అనే నవల ఆధారంగా తెరకెక్కింది.ఇక డిఫరెంట్ పాయింట్ తో పాత్రలు మార్చుకొని ఒకరి స్థానంలో మరొకరు వెళ్ళడం అనే ఎలిమెంట్ ఈ సినిమా సక్సెస్ లో ఒక భాగం అయ్యింది.
దీంతో సినిమా అప్పట్లో ప్రేక్షకులకి భాగా కనెక్ట్ అయ్యింది.
అయితే మళ్ళీ 34 ఏళ్ల తర్వాత అదే నవలని యండమూరి వీరేంద్రనాథ్ స్వీయ దర్శకత్వంలో మళ్ళీ తెరకెక్కించారు.
అందరూ కొత్తవాళ్లతో ఈ మూవీని భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించారు.నవలలో ఉన్న కథాంశంతోనే ఈ మూవీని కంప్లీట్ గా యండమూరి ఆవిష్కరించినట్లు తెలుస్తుంది.
తాజాగా ఈ మూవీటైటిల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.అలాగే త్వరలో ఊర్వశీ ఒటీటీలో ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాత రామసత్యనారాయణ స్పష్టం చేశారు.
ఒటీటీ కోసమే ఈ మూవీని ప్రత్యేకంగా తెరకెక్కించినట్లు తెలిపారు.ఓ విధంగా చెప్పాలంటే చిరంజీవి దొంగ మొగుడు మూవీని మరోసారి అఫీషియల్ గా రీమేక్ చేసి ప్రేక్షకుల ముందుకి నల్లంచు తెల్లచీర ద్వారా తీసుకొస్తున్నారని చెప్పాలి.
మరి ఈ మూవీ ప్రేక్షకులని ఆకట్టుకుంటుందా లేదంటే దొంగ మొగుడు ఇమేజ్ ని దెబ్బ తీస్తుందా అనేది చూడాలి.