సీఎం వీడియో గేమ్స్‌, మంత్రులు కోడిపందాలు

అమరావతి రైతులు రాజధాని విషయంలో చేస్తున్న ఆందోళనల గురించి ఏపీ ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో మాజీ మంత్రి యనమల రామకృష్ణ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశాడు.ఏపీకి మూడు రాజధానులు అక్కర్లేదు అని సామాన్యుల నుండి అంతా కూడా అంటున్నారు.

 Yanamala Ramakrishnudu Comments On Jagan And Ycp Ministers-TeluguStop.com

అలాంటి సమయంలో రాజకీయ కారణాల వల్ల రాజధానిని అమరావతి నుండి తరలించడం ఏమాత్రం కరెక్ట్‌ కాదని అన్నాడు.ప్రస్తుతం రైతులు ఆందోళన చేస్తున్న ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందని అన్నాడు.

సీఎం జగన్‌ వీడియో గేమ్స్‌ ఆడుతూ బిజీగా ఉంటే, ఆయన మంత్రులు మాత్రం సంక్రాంతికి కోడిపందాలు వేసేందుకు రెడీ అవుతున్నారు అంటూ ఈ సందర్బంగా యనమల ఆగ్రహం వ్యక్తం చేశాడు, రైతుల మరియు ప్రజల శ్రేయస్సు పట్టని ఈ ప్రభుత్వం ఉండక్కర్లేదు అంటూ ఈ సందర్బంగా యనమల అన్నాడు.ఇన్నాళ్లు సుదీర్ఘ చరిత్ర ఉన్న తెలుగు రాష్ట్రాలకు ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి పరిస్థితని తీసుకు రాలేదు అంటూ యనమల అన్నాడు.

సీఎం అయిన వ్యక్తి ప్రతి వారం కోర్టు బోను ఎక్కడం రాష్ట్ర పరువుకు దెబ్బ అన్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube