బాలీవుడ్ లో హీరోయిన్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న నటి యామి గౌతమ్.ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ ద్వారా అందరి దృష్టిని ఆకర్షించిన ఈ నటి తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తనదైన ముద్ర వేసుకుంది.
తెలుగులో రవిబాబు నువ్విలా, అల్లు శిరీష్ కి జోడీగా గౌరవం అనే సినిమాలో నటించింది.అలాగే నితిన్ తో కొరియర్ బాయ్ కళ్యాణ్ అనే సినిమాలో జతకట్టింది.
ఈ మూడు సినిమాలు తెలుగులో అనుకున్న స్థాయిలో వర్కవుట్ కాకపోతే కంప్లీట్ గా ఆమె ఫోకస్ బాలీవుడ్ పైనే పెట్టింది.అక్కడ మంచి మంచి సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది.
ఇదిలా ఉంటే గత రెండేళ్ల కాలంలో చాలా మంది సెలబ్రెటీలు పెళ్లి చేసుకొని కొత్త జీవితం స్టార్ట్ చేశారు.రీసెంట్ గా టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత కూడా బెంగళూరుకు చెందిన ఓ వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుంది.
అలాగే గత ఏడాది టాలీవుడ్ యువ హీరోలైన రానా, నితిన్, నిఖిల్ పెళ్లి చేసుకున్నారు.కాజల్ అగర్వాల్ కూడా పెళ్లి చేసుకొని కొత్త జీవితం స్టార్ట్ చేసింది.
వీరంతా కరోనా కారణంగా ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సింపుల్ గా పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు.ఇదిలా ఉంటే ఇప్పుడు యామి గౌతమ్ కూడా పెళ్లి పీటలు ఎక్కింది.
కరోనా సిచువేషన్ కారణంగా ఎలాంటి ఆర్బాటం లేకుండా కేవలం కుటుంబ సభ్యులు సమక్షంలో బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ తో ఈమె మూడు ముళ్ళు వేయించుకుంది.శుక్రవారం వీరి పెళ్లి వేడుక జరిగింది.
ఈ విషయాన్ని యామి గౌతమ్ సోషల్ మీడియా ద్వారా అభిమానులకి తెలియజేసింది.దీంతో పాటు తన పెళ్లి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.
ఇక యామి గౌతమ్ పెళ్లి చేసుకున్న దర్శకుడు ఆదిత్య “ఉరి: ది సర్జికల్ స్ట్రైక్” మూవీతో బాలీవుడ్ లో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు.ప్రస్తుతం విక్కీ కౌశల్ హీరోగా ది ఇమ్మోర్టల్ అశ్వద్ధామ మూవీని తెరకెక్కించే ఎందుకు రెడీ అవుతున్నారు.
మహాభారతం ఆధారంగా ఫిక్షన్ స్టోరీ లైన్ తో ఈ మూవీ తెరకెక్కుతుంది.ఇక పెళ్ళి తర్వాత కూడా యామి గౌతమ్ సినిమాల్లో నటించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.