మనిషి అన్న ప్రతి ఒక్కడికి చావు వస్తుంది, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడు చావక తప్పదు.అయితే ఎప్పుడో రాబోతున్న చావు గురించి కొందరు తెగ భయపడుతూ ఉంటారు.
చనిపోతానేమో, ఆ పన చేస్తే చంపేస్తారేమో, ఇలా చేస్తే చనిపోతానేమో అనే భయం అందరిలో ఉంటుంది.చావు రాకముందే చనిపోయేలా భయపడే వారు ఎంతో మంది ఉంటారు.
వారందరి కోసం ఈ భూమి మీద ఒకే ఒక్క సరస్సు ఉంది.ఆ సరస్సులో స్నానం చేసిన వారు చావు భయం పోగొట్టుకుంటారు.
చావు కూడా ఆలస్యంగా వస్తుందని అక్కడి వారి నమ్మకం.
యము కట్టించిన ఆ సరస్సు గురించి తమిళనాడు వ్యాప్తంగా పెద్ద ఎత్తున నమ్మకం ఉంది.
తమిళనాడులోని తంజావూరు జిల్లా తిరువైకాపూర్ అనే చిన్న గ్రామంలో ఒక గుడి ఉంటుంది.ఆ గుడిలో ఉన్న సరస్సును స్వయంగా యమ ధర్మ రాజు నిర్మించాడని, శివుడి ఆజ్ఞానుసారం యమ ధర్మ రాజు ఆ సరస్సులో స్నానం చేసిన వారిని భయ పెట్టడని చెబుతూ ఉంటారు.
ప్రతి రోజు కొన్ని వందల మంది ఆ సరస్సులో స్నానం చేసేందుకు వస్తారు.తంజావూరు జిల్లా నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి కూడా ఈ సరస్సులో స్నానం చేసేందుకు జనాలు వస్తూ ఉంటారు.
కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక వేటగాడు జింకను తరుముకుంటూ ఈ ప్రదేశానికి వచ్చాడట.గుడి ఉన్న ప్రదేశంలో వేటగాడు వెళ్లగానే ఒక సింహం గాండ్రింపు వినిపించింది.దాంతో ఆ వేటగాడు చావు భయంతో గుడి ప్రాంగణంలో ఉన్న చెట్టుపైకి ఎక్కాడు.అతడు ఎక్కిన చెట్టు కింద శివ లింగం ఉంది.రాత్రి అంతా కూడా ఆ వేటగాడు శివలింగంపై తాను కూర్చుని ఉన్న బిల్వ చెట్టు ఆకులను తెంచుతూ వేయడం చేశాడు.రాత్రి అంతా కూడా నిద్ర పోకుండా ఒక్కో ఆకును శివలింగంపై వేయడం జరిగింది.
దాంతో బిల్వ ఆకుల అభిషేకంకు ప్రసన్నం అయిన శివుడు ఆ వేటగాడికి ఉన్న చావు భయంను పోగొట్టాలనుకున్నాడు.యముడిని పిలిచి ఈ ప్రదేశంలో ఒక సరస్సు ఏర్పాటు చేయమని, దానిలో స్నానం చేసిన వారికి చావు భయం లేకుండా చేయమని ఆదేశించాడు.
అలా శివుడి ఆజ్ఞతో యముడు ఈ సరస్సును ఏర్పాటు చేశాడు.అందుకే దీనికి ఇంత ప్రాముఖ్యత ఉందని స్థానికులు చెబుతున్నారు.