హైదరాబాద్ హెచ్సీసీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు అట్టహాసంగా జరుగుతున్నాయి.ఈ సమావేశాలకు ప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు పాల్గొన్నారు.
ఇవాళ రెండో రోజు కూడా సమావేశాలు జరుతున్నాయి.తొలి రోజు దేశాభివృద్ధిపై చర్చించారు.
నేడు రాజకీయ తీర్మాలకు ఆమోదం తెలపనున్నారు.అలాగే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో మోదీ భారీ బహిరంగ సభ జరగనుంది.
ఈ సభకు అన్ని ఏర్పాట్లు చేశారు.ఇదిలా ఉంటే ఈ రెండు రోజులు పాటు హైదరాబాద్లో ఉన్న బీజేపీ నేతలకు సకల సౌకర్యాలు కల్పించారు.
భోజన, బస ఏర్పాట్లను రాష్ట్ర బీజేపీ నేతలు దగ్గరుండి చూస్తున్నారు.తెలంగాణ వంటకాను ఇతర రాష్ట్రాల బీజేపీ నేతలకు రుచి చూపించారు.
మరోవైపు ఈ సమావేశాలతో రాష్ట్ర బీజేపీ కేడర్లో ఫుల్ జోష్ నెలకొంది.వచ్చే ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ నేతలు చేసిన దిశానిర్ధేశంతో నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం కోసం కృషి చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సహా కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు.బీజేపీ దిగ్గజాలు ఈ రోజు తెలంగాణ వంటకాల రుచి చూడబోతున్నారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి గుడాటిపల్లెకి చెందిన యాదమ్మ చేతితో చేసిన వంటకాలను ప్రముఖులందరు టేస్ట్ చేయబోతున్నారు.భోజనంతో పాటు స్నాక్స్ సైతం తెలంగాణ స్టయిల్ లోనే తయారు చేస్తున్నారు.
స్వీట్స్ సైతం తెలంగాణ తినుబండారాలనే వడ్డిస్తుండటం విశేషం.స్వీట్స్ సహా దాదాపు 50 రకాల వంటకాలను అతిరథ మహారథుల కోసం స్పెషల్ మోనూ ఫైనల్ చేశారు.
అవన్నీ స్వయంగా యాదమ్మ చేతితోనే చేస్తుండటం గమనార్హం.
ఇక వంటల విషయానికి వస్తే చిక్కుడుకాయ టమోటా, ఆలు కూర్మ, వంకాయ మసాలా కర్రీ, దొండకాయ పచ్చికొబ్బరి తురుము ఫ్రై, బెండకాయ కాజు పల్లీల ఫ్రై, తోటకూర టమోటా ఫ్రై, బీరకాయ మిల్ మేకర్ చూర ఫ్రై, మెంతికూర పెసరపప్పు ఫ్రై, గంగవాయిలకూర, మామిడికాయ పప్పు, సాంబారు, ముద్దపప్పు, పచ్చిపులుసు, బగార, పులిహోర, పుదీనా రైస్, వైట్ రైస్, పెరుగన్నం, గోంగూరు పచ్చిడి, దోసకాయ ఆవ చట్నీ, టమోటా చట్నీ, సొరకాయ చట్నీలను చేస్తున్నారు.వీటితో పాటు స్వీట్స్ బెల్లం పరమాన్నం, సేమియా పాయసం, భక్షాలు, బూరెలు, అరిసెలు సిద్ధం చేస్తున్నారు.స్నాక్స్ విషయానికొస్తే … పెసరపప్పు గారెలు, సకినాలు, మక్క గుడాలు, సర్వపిండి, టమోటా చట్నీ, పల్లీ చట్నీ, పచ్చి కొబ్బరి చట్నీ, మిర్చిలను వేయబోతున్నారు.