ప్రస్తుతం భారతదేశంలో నెంబర్ వన్ మొబైల్ కంపెనీగా కొనసాగుతున్న చైనా సంస్థ షియోమీ తన సరికొత్త మొబైల్ సీరీస్ ను ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేయడానికి సన్నద్ధం కాబోతోంది.ఇప్పటికే అనేక మోడల్స్ ను తీసుకొనివచ్చి మార్కెట్ లో సేల్స్ పరంగా దూసుకెళ్తుంది.
తాజాగా రెడ్ మీ 10 పేరుతో సరికొత్త సిరీస్ లో ఫోన్లను ప్రజలకు చేర్చడానికి రంగం సిద్ధం చేసింది.
ఇక ఈ ఫోన్లో కి సంబంధించి ఇది వరకే
గౌగ్విన్, గౌగ్విన్ ప్రో
పేరుతో షియోమీ వీటిని రిజిస్టర్ చేయించుకుంది.
ఇక షియోమీ కంపెనీ తాజాగా ఎమ్ఐ 10 సిరీస్ పేరుతో కొత్త మొబైల్ సిరీస్ ను సెప్టెంబర్ 30వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు మొదలు పెట్టింది.ఇక ఈ రిలీజ్ లో భాగంగా కొత్తగా షియోమి ఎమ్ఐ 10 T, అలాగే ఎమ్ఐ 10 T ప్రో విడుదల చేసే విధంగా సన్నాహాలు చేస్తోంది.
ఇక ఈ మొబైల్ కి సంబంధించి స్పెసిఫికేషన్లు చూస్తే… స్క్రీన్ 6.67 ఇంచులు కలిగి ఉండగా, స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్ని ఉపయోగించబోతున్నారు.ఇక అలాగే 8 జిబి రామ్, అలాగే 128 లేదా 256 జీబీ ఇంటర్నల్ మెమొరీ వేరియంట్లను విడుదల చేయబోతున్నారు.అలాగే కెమెరాల విషయానికి వస్తే 108 మెగా పిక్సెల్ ఉన్న కెమెరా ని అందించబోతుంది.
ఇక 5000 mah బ్యాటరీని ఈ ఫోన్ కలిగి ఉంది.ఈ ఫోన్ 5g టెక్నాలజీని సపోర్ట్ చేయగలదు.ఇక ధరల విషయానికి వస్తే ఎంఐ 10 T రూ.5500 గా, అలాగే ఎమ్ఐ 10 ప్రో 7 వేల రూపాయలు ఉండబోతున్న ట్లు సమాచారం.