కొన్ని కారణాల వల్ల చదువును మద్యలో వదిలేసిన చాలా మంది మళ్లీ ఉన్నత చదువులు చదివేందుకు లేటు వయసులో పుస్తకం పడుతున్న విషయం తెల్సిందే.చాలా మంది కూడా దూర విద్య ద్వారా డిగ్రీలు మరియు పీజీలు పూర్తి చేస్తున్నారు.
అలా రాజకీయ నాయకులు కూడా దూర విద్యద్వారా ఉన్నత చదువులు చదవడం మనం చూస్తూనే ఉంటాం.ప్రస్తుతం వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే… ఖమ్మం జిల్లా వైరాకు చెందిన ఎమ్మెల్యే రాములు నాయక్ ప్రస్తుతం పీజీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.ఆయనకు చదువుపై చాలా ఆసక్తి ఉంటుంది.
దాంతో పీజీని ఇప్పుడు చేస్తున్నాడు.ఒకవైపు ఎమ్మెల్యేగా చాలా బిజీగా ఉన్నా కూడా మరో వైపు పీజీని చేయాలనే ఉద్దేశ్యంతో కష్టపడి చదువుతున్నాడు.
ఎమ్మెల్యే రాములు నాయక్ అందరికి ఆదర్శం అంటూ అందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.రాములు నాయక్ ఎమ్మెల్యేగా ఉండి కూడా ఇంకా చదువుతుండటం చూస్తే ఇతరులు కూడా తమ చదువును కొనసాగించాలనే ఆలోచన వస్తుంది.