నేడు హైదరాబాద్ లోని గచ్చిబౌలి వేదికగా డబ్ల్యూడబ్ల్యూఈ పోరు..!

హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం( Gachibowli Indoor Stadium ) వేదికగా నేడు వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ ( World Wrestling Entertainment )పోరుకు రంగం సిద్ధమైంది.2017లో భారతదేశంలో చివరిసారిగా డబ్ల్యూడబ్ల్యూఈ ఈవెంట్ జరిగింది.

ఆరేళ్ల తర్వాత 2023 సెప్టెంబర్ 8వ తేదీ శుక్రవారం మళ్లీ భారతదేశంలోని హైదరాబాద్ నగరంలో డబ్ల్యూడబ్ల్యూఈ ( WWE )ఈవెంట్ నిర్వహిస్తున్నారు.

ఈ పోరులో 16 సార్లు ప్రపంచ ఛాంపియన్ రెజ్లింగ్ ఆల్ టైం గ్రేట్ జాన్ సినా, ఇక్కడ బరిలోకి దిగుతూ ఉండడంతో ఈ ఈవెంట్ కోసం అభిమానులు పెద్ద సంఖ్యలో గచ్చిబౌలి ఇండోర్ స్టేడియానికి రానున్నారు.అతని ఫైట్ చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో ఎగబడటంతో ముందుగానే బుక్ మై షో టికెట్లన్నీ అమ్ముడైపోయాయి.

ప్రపంచ ఛాంపియన్ రెజ్లింగ్ జాన్ సినా( Wrestling John Cena ) భారత్ లో బరిలోకి దిగడం ఇదే మొదటిసారి.కావున హైదరాబాద్ తో పాటు భారతదేశంలోని ఇతర నగరాల నుండి కూడా రెజ్లింగ్ ఫ్యాన్స్ ఈ ఫైట్ ను తిలకించేందుకు వస్తున్నారు.గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా సూపర్ స్టార్ స్పెక్టకిల్ పేరుతో నిర్వహిస్తున్న ఈ ఈవెంట్లో జాన్ సినా తో పాటు పలువురు ప్రముఖ రెజ్లర్లు పాల్గొంటున్నారు.

నేడు జరిగే ఈ రెజ్లింగ్ పోరులో ఫిన్ బాలర్, రియా రిప్లీ, సేట్ రోలిన్స్ పాల్గొననున్నారు.ప్రపంచ హెవీ వెయిట్ ఛాంపియన్ రోలిన్స్ తో కలిసి జాన్ సినా.

Advertisement

గియో వానీ విన్సీ, లుడ్విన్ కై సర్డ్ జోడితో తలపడనున్నారు.ఇక మహిళల విభాగానికి వస్తే డిపెండింగ్ వరల్డ్ ఛాంపియన్ రియా రిప్లీ ప్రధాన ఆకర్షణ గా నిలువనుంది.

ఈరోజు శుక్రవారం రాత్రి 7:30 గంటలకు ఈవెంట్ ప్రారంభం అవ్వనుంది.ఈ ఫైట్ ను వీక్షించాలనుకుంటే సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ లో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు.

Advertisement

తాజా వార్తలు