దర్శక దిగ్గజం రాజమౌళి మరో పాన్ ఇండియా మూవీగా ఆర్ఆర్ఆర్ ని తెరపై ఆవిష్కరిస్తున్నారు.ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవగన్ లాంటి స్టార్ క్యాస్టింగ్ తో భారీ మల్టీ స్టారర్ చిత్రంగా ఇది తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
ఇక హాలీవుడ్ నటులు కూడా ఇందులో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు.అలియా భట్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఇక అల్లూరి సీతారామరాజు, కొమరాం భీమ్ పాత్రలని తీసుకొని కంప్లీట్ గా కల్పిత కథతో దీనిని తెరకెక్కిస్తున్నామని ఇప్పటికే రాజమౌళి క్లారిటీ ఇచ్చేశారు.ఏకంగా రెండు వందల కోట్లకి పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీకి విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన విషయం అందరికి తెలిసిందే.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి రచయిత విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికర విషయాలని పంచుకున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి ఎంత ఎక్కువ చెప్పినా అది తక్కువే అవుతుంది.సాధారణంగా సినిమాల్లో యాక్షన్ సీన్స్ చూస్తున్నప్పుడు కొందరు ప్రేక్షకులు విజిల్స్ వేస్తూ, గోల చేస్తూ సందడి చేస్తుంటారు.కానీ ఆర్ఆర్ఆర్ చిత్రంలోని కొన్ని యాక్షన్ సన్నివేశాలను చూసినప్పుడు నాకు కన్నీళ్లు వచ్చాయి.
ఈ సినిమాలోని కొన్ని సీన్స్ లో ఒక రకమైన బాధ దాగి ఉంది.సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు కూడా కచ్చితంగా భావోద్వేగానికి గురవుతారనే నమ్మకం ఉంది.ఫస్ట్ టైమ్ ఫైట్ సీక్వెన్స్ కి ఎమోషన్ అవ్వడం ఆర్ఆర్ఆర్ లో కనిపిస్తుందని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.విజయేంద్ర ప్రసాద్ మాటలు మాత్రం ఇప్పుడు సినిమాపై మరింతగా హైప్ ని క్రియేట్ చేసేలా ఉన్నాయని టాక్ వినిపిస్తుంది.