ఆంధ్రప్రదేశ్ లోని ఒక కర్రీ పాకెట్ ధర వెయ్యి రూపాయలకు పైగానే పలుకుతోంది.సాధారణంగా ఎంత పెద్ద కర్రీ ప్యాకెట్ తీసుకున్నా 100 రూపాయల లోపే ఖర్చవుతుంది.
కానీ ఏపీలో మాత్రం ఒక కర్రీ ప్యాకెట్ వేలల్లో ధర పలుకుతుంది.ఎందుకంటే నిజానికి ఇది కర్రీ ప్యాకెట్ కాదు.
కర్రీ ప్యాకెట్స్గా కనిపించే గంజాయి.స్మగ్లర్లు ఎవరికీ అనుమానం రాకుండా కర్రీ లాంటి ప్యాకెట్లలో గంజాయి వేసి వాటిని జోరుగా అమ్మేస్తున్నారు.
బిర్యానీ ప్యాక్ చేసే కవర్లలోనూ ఈ మత్తుపదార్థాలను ప్యాక్ చేసి పంపిస్తున్నారు.ఈ వ్యవహారమంతా ఆన్లైన్ గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతోంది.
వీటిని ముఖ్యంగా కాలేజీ విద్యార్థులకు అక్రమంగా అందజేస్తున్నారు.
విశాఖ నగరం అభివృద్ధిలో వేగంగా దూసుకుపోతోంది కానీ ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువత మత్తులో జోగుతూ ఆందోళన కలిగిస్తున్నారు.
నేరాలు పెరుగుతూనే ఉండగా వాటిని పూర్తిగా అదుపులో పెట్టేందుకు పోలీసులు చేసే ప్రయత్నాలన్నీ విఫలం అవుతున్నాయి.రోజూ ఎంతో మందిని పట్టుకొని గంజాయి సరఫరాకి కళ్లెం వేయాలని పోలీసులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
అయితే ప్రతి రోజూ ఎక్కడో ఒకచోట కొత్తగా ఎవరో ఒకరు మద్యం సరఫరా చేస్తూనే ఉన్నారు.మీరు పట్టు బడుతూనే ఉన్నారు.ప్రత్యేక యంత్రాంగాలతో కర్రీ ప్యాకెట్లను తయారుచేసి చాలా తెలివిగా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు.
యువతరం తెలిసీ తెలియక వీటికి అలవాటు పడి తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు.వీరిని టార్గెట్ చేస్తూ వీరి నుంచి భారీ ఎత్తున డబ్బులను కొల్లగొడుతున్నారు కేటుగాళ్ళు.అయితే విశాఖపట్నంలోని తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.