మరణం ఈ లోకం నుండి మనుషులకు ఉన్న బంధాలను శాశ్వతంగా తెంపేసె చివరి ప్రయాణం.అందుకే చచ్చేలోపల ఏదో ఒకటి చేయాలి అని ఆరాటపడుతుంటారు జనం.
అయితే ఇలా ఆలోచించే వారు లోకంలో ఎక్కువే ఉన్నారు కానీ ఆచరించే వారు తక్కువే.ఇలాగే ఆలోచించిన ఓ మహిళ తాను మరణిస్తూ కూడా ఓ మంచిపని చేసింది.
ఏం చేసిందో తెలుసుకుంటే.
రాజస్థాన్ లోని జోథ్ పూర్ కు చెందిన ఆశా అనే ఓ మహిళ తను చనిపోయాక తనకు సంబంధించిన నగలన్నీ రాముడికి సమర్పించాకే తన అంత్యక్రియలు నిర్వహించాలని చివరి కోరికగా తన భర్త విజయ్ సింగ్ ను కోరింది.
చెప్పినట్టుగానే ఆశా భర్త ఫిబ్రవరి 4న జోథ్ పూర్లో రామాలయం నిర్మించడానికి విరాళాలు సేకరిస్తున్న, హేమంత్ అనే పూజారికి ఫోన్ చేసి విషయం చెప్పగా అతను ఆ మాటలకు ఆశ్చర్యపోయారు.
అయితే ముందుగా అంత్యక్రియలు నిర్వహించమని ఆ తర్వాత నగలు తీసుకుంటామని తెలియచేశాడు పూజారి.
చూశారా రాముడి పై భక్తితో, మరణించాక కూడా తన వంతుగా దోహదపడింది ఈ మహిళ.