సాధారణంగా మెగాస్టార్ చిరంజీవి సినిమా థియేటర్లలో విడుదలవుతుందనే బాక్సాఫీస్ వద్ద సందడి మామూలుగా ఉండదు.చిరంజీవి, చరణ్ కాంబినేషన్ లో సినిమా అంటే ఆ సినిమాపై మామూలుగా అంచనాలు ఏర్పడవు.
అయితే ఆచార్య సినిమా విషయంలో మాత్రం భిన్నంగా జరిగింది.చిరంజీవి, చరణ్ కలిసి నటించినా కొరటాల శివ దర్శకత్వం వహించినా పూజా హెగ్డే ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటించినా సినిమా మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.
తొలిరోజు మార్నింగ్ షోకే ఆచార్య సినిమాకు ఫ్లాప్ టాక్ రాగా ఈ సినిమా పుంజుకునే అవకాశాలు కూడా దాదాపుగా కనిపించడం లేదు.మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీగా నష్టాలను మిగిల్చిన జాబితాలో ఆచార్య సినిమా కూడా ఒకటిగా నిలిచింది.
నష్టాల జాబితాలో రాధేశ్యామ్ తర్వాత స్థానంలో ఆచార్య సినిమా ఉండటంతో మెగా అభిమానులు సైతం ఒకింత కంగారు పడుతున్నారు.ఆచార్య సినిమాకు దాదాపుగా 84 కోట్ల రూపాయలకు పైగా నష్టాలు వచ్చాయి.
అయితే నిర్మాత నిరంజన్ రెడ్డి, కొరటాల శివ, చిరంజీవి, చరణ్ ఇప్పటికే ఈ నష్టాలను భర్తీ చేశారని సమాచారం అందుతోంది.ఆచార్య సినిమాకు వచ్చిన నష్టాల వల్ల కొరటాల శివ ఈ సినిమాకు సంబంధించి పూర్తిస్థాయిలో రెమ్యునరేషన్ ను వదులుకున్నారని సమాచారం అందుతోంది.కొరటాల శివ కెరీర్ పై ఈ సినిమా ద్వారా నెగిటివ్ మార్క్ పడిందనే చెప్పాలి.మరోవైపు కొరటాల శివ తర్వాత సినిమా షూటింగ్ ను ఆలస్యంగా మొదలుపెట్టనున్నారని జులై నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని తెలుస్తోంది.
ఆచార్య సినిమా విషయంలో జరిగిన ఏ పొరపాటు కూడా తారక్ సినిమా విషయంలో రిపీట్ కాకూడదని కొరటాల శివ భావిస్తున్నారని తెలుస్తోంది.ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందని బోగట్టా.