చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ ఎంత దారుణంగా వ్యాపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అగ్ర రాజ్యం సైతం కరోనా వైరస్ కు వణికిపోతుంది.
ఈ దేశం ఆ దేశం అని తేడా లేకుండా అన్ని దేశాలకు వ్యాపించి దాని తీవ్రత ఏంటో చూపిస్తుంది.అయితే కరోనా వైరస్ తీవ్రత ఎలా ఉందో దాని నుండి కోలుకున్న వారి సంఖ్య కూడా అలానే ఉంది.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా 16,442,487 మందికి కరోనా వైరస్ వ్యాపించగా అందులో కోటి మందికిపైగా కరోనా నుండి విముక్తి లభించింది.ఇప్పటి వరకు కోటి మంచి కరోనా నుండి కోలుకున్నారు.
6,442,487 మంది కరోనా వైరస్ కు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.ఇక మరణాల విషయానికి వస్తే ఇప్పటివరకు 6,51,580 మంది కరోనా వైరస్ కు బలయ్యారు.
కాగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మరణాలు మెక్సికోలో సంబవిస్తుండగా భారత్ తరువాతి స్థానంలో నిలిచింది.అయితే కరోనా వైరస్ ఈ ఏడాది చివరికి వస్తుందని పరిశోధకులు చెప్తున్నారు.తాజాగా భారత్ 14 లక్షల కరోనా పాజిటివ్ కేసులను దాటింది.ఇంకా అందులో 9 లక్షలమందికిపైగా కరోనా నుండి కోలుకోగా 32 వేల కరోనా వైరస్ కు బలయ్యారు.
ఇంకా 4 లక్షలమందికిపైగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.