సోషల్ మీడియా.ఈ పేరుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.
ప్రపంచ నలుమూలల్లో ఎక్కడ ఏమైనా జరగనివ్వండి.అప్పటి వరకు పక్కింటి వారికి కూడా తెలయని ఆ మ్యాటర్ను ప్రపంచానికి పరిచయం చేసేస్తుంది ఈ వేదిక.
అయితే అది కూడా కేవలం గంటల్లోనే ప్రపంచానికి చేరవేస్తోందంటే దీనికి ఉన్న ఫాలోయింగ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.ఇప్పటికే ఎన్నో వింతలు, వివేషాలను పరిచయం చేసిన ఈ సోషల్ మీడియా ఇప్పుడు మరో వింత వీడియోను మన ముందుకు తీసుకొచ్చింది.
పక్షుల్లో చాలా రకాలు ఉంటాయి.ఇందులో కొన్ని చూసేందుకు ఆనందాన్ని కలిగించేవి ఉంటే.మరికొన్ని మాత్రం భయాందోళనకు గురి చేసేవి కూడా ఉంటున్నాయి.చూసేందుకు ప్రమాదకరంగా ఉండే పక్షులు కూడా ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయండోయ్.
ఇప్పుడు మీకు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర పక్షి గురించి చెప్పబోతున్నాం.అయితే అది చేసే పని వింటే మీరు నిజంగానే షాక్ అయిపోతుంటారు.
ఈ ప్రమాదకర పక్షి పేరు కాసోవరి.ఈ ప్రమాదకర పక్షి ఇప్పుడు ఓ వ్యక్తి షాప్ కు నిత్యం వస్తోందంట.
ఒక రోజు రెండు రోజులు కాకుండా ఏడాదికి పైగా వస్తోందని తెలుస్తోంది.
దీన్ని చూసేందుకు కూడా చాలామంది భయపడిపోతున్నారు.ఇక షాపు ఓనర్ కూడా దాన్ని ఏమీ అనకుండ దాని కోసం సెపరేటు ఏర్పాట్లు చేస్తున్నాడంట.అది షాపుకు వచ్చి అందులో ఉండే రేగుపళ్ళను తినేసి వెళ్లిపోతుందంట.
దాదాపు 70కిలోల దాకా ఉండే ఈ భారీ పక్షి చాలా పెద్దగా ఉంటుంది.ఇక ఇది షాపుకు వస్తున్న విషయం తెలిసి చాలామంది దాన్ని చూసేందుకు తమ షాపుకు వస్తున్నారని, దాన్ని ఫొటోలు, వీడియోలు తీసుకుంటున్నారని ఆ షాపు ఓనర్ చెబుతున్నాడు.
ఇక ఇలా వస్తున్న ఆ పక్షి వీడియోలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
.