దీపావళి అంటేనే వెలుగుల పండుగ.తమ ఇంట సిరిసంపదలు వెల్లి విరియాలని, చీకటిపై వెలుగు గెలుపుకు ప్రీతకగా ప్రజలు ఈ పండగను చేసుకుంటారు.
దీపావళిని కుల,మత భేదం లేకుండా అందరూ కలిసి జరుపుకుంటారు.అయితే ఈసారి అతిపెద్ద దీపావళికి భారతదేశం సిద్ధమవుతోంది.
అతిపెద్ద దీపావళి ఏంటని అనుకుంటున్నారా.గువాహటిలో ప్రతియేటా దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు.
ఈసారి కూడా దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారు.ఇప్పటికే ఈ వేడుకల్లో ప్రత్యేకతను చాటేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద మట్టి ప్రమిదను సిద్ధం చేశారు.
ఏకంగా 200 లీటర్ల నూనెతో ఈ దీపాన్ని వెలిగించనున్నారు.
మట్టి ప్రమిదలో ఇదే పెద్దదని నిర్వాహకులు తెలిపారు.దీనిని రెండు అడుగుల ఎత్తు, ఎనిమిది అడుగుల వెడల్పుతో ఏర్పాటు చేశారు.ఈ దీపావళిని మరింత పెద్దగా జరుపుకునేందుకు ఈ ఏర్పాట్లు చేసినట్లు.
ప్రజలందరూ సుఖసంతోషాలతో దీపావళి వేడుకను జరుపుకోవాలని నిర్వాహకులు కోరారు.మీరు కూడా మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి దీపావళి పండగను సంతోషంగా జరుపుకోవాలని తరఫున కోరుకుంటున్నాము.