కూతురు పెళ్లి ఎంతో ఘనంగా నిర్వహించాలనీ ప్రతీ ఒక్క తల్లిదండ్రులు భావిస్తారు ఈ తరహాలోనే ప్రపంచంలోని అత్యంత ధనిక స్టీల్ మ్యాగ్నెట్ లక్ష్మి మిట్టల్, తమ్ముడైన ప్రమోద్ మిట్టల్ తన కూతురు వివాహాన్ని ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు.తన కూతురు పెళ్లి గురించి నాలుగు కాలాల పాటు మాట్లాడుకోవాలి అన్న ఉద్దేశంతో ఏకంగా 500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఘనంగా తన కూతురి వివాహం జరిపించారు.
ఇంత ఘనంగా పెళ్ళి నిర్వహించిన ప్రమోద్ మిట్టల్ ప్రస్తుతం దివాలా తీశారు…ప్రమోద్ మిట్టల్ ప్రస్తుతం భారీ అప్పులతో సతమతమవుతున్నారు.ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా2.5 బిలియన్ పౌండ్లు బాకీ ఉన్నట్లు ఓ నివేదికలో తెలిపారు.ప్రమోద్ మిట్టల్ 2006 సంవత్సరంలోబోస్నియన్ కోక్ తయారీ కంపెనీ జీఐకేఐఎల్ రుణాలకు తన గ్లోబల్ స్టీల్ హోల్డింగ్స్ తరుపున ప్రమోద్ మిట్టల్ గ్యారెంటీ సంతకం చేయడంతో ఇతని పతనం అప్పుడే మొదలైందని చెప్పవచ్చు.
అయితే ఆ కంపెనీ మోర్గేట్ఇండస్ట్రీకి చెల్లించాల్సిన సొమ్మును కట్టకపోవడంతో, మోర్గేట్ కంపెనీ ప్రమోద్ మిట్టల్ ను 166 మిలియన్ల డాలర్ల కోసం కోర్టుకు లాగింది.దీంతో అంత రుణం ఆయన చెల్లించకపోవడంతో దివాలా తీశారు.
ఒకప్పుడు కూతురు పెళ్లి ఎంతో ఘనంగా నిర్వహించిన ప్రమోద్ మిట్టల్ ఇప్పుడు భారీ అప్పుల్లో కూరుకుపోయారని ఇంత భారీ మొత్తంలో అప్పు ఉన్న వ్యక్తి బ్రిటన్ లోనే ఎవరు లేరు.ప్రస్తుతం ప్రమోద్ మిట్టల్ కు ఎటువంటి ఆదాయం లేదు.
కానీ 66 వేల పౌండ్లు విలువైన షేర్లు, 7 వేల పౌండ్లు విలువైన జ్యువెలరీ, భారతదేశంలో 45 వేల పౌండ్లు విలువైన ఆస్తులు ప్రమోద్ మిట్టల్ కు ఉన్నాయి.అయితే ఈ అప్పుల ఊబి నుంచి ప్రమోద్ మిట్టల్ ను, తన అన్న లక్ష్మీ మిట్టల్ ఏ మాత్రం ఆదుకునే అవకాశాలు లేవని పలు నివేదికలు పేర్కొంటున్నాయి.