ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ సృష్టిస్తున్న మరణ సునామీకి ప్రభుత్వాలు మరియు ప్రపంచంలో ఇతర దేశాలు బెంబేలెత్తిపోతున్నాయి.ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు ఇండియాలో కరోనా పరిస్థితులపై వైరల్ కామెంట్లు చేస్తున్నారు.
రోజుకి కొత్త కేసుల సంఖ్య నాలుగు లక్షలకు చేరటం మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగి పోతుండటంతో ఆందోళన వ్యక్తం చేశారు.
అంతేకాకుండా గత వారం ప్రపంచం లో నమోదైన కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పరంగా చూసుకుంటే సగం మొత్తం ఇండియాలో నమోదయినట్లు WHO కీలక కామెంట్లు చేసింది.
ప్రపంచంలో చోటు చేసుకుంటున్న ప్రతి 4 కోవిడ్ మరణాలలో ఒకటి భారత్ లోనే అని అంటోంది.అంతేకాకుండా ఆసియాలో నమోదవుతున్న కేసులలో 90% ఇండియా లోనివే అని స్పష్టం చేసింది.
ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 46 శాతం ఇండియా నుండే కేసులు నమోదు అవుతున్నట్లు డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కోవిడ్ మరణాలలో 25 శాతం భారత్ లోనివి అని నివేదికలో తెలిపింది.
ఇప్పటివరకూ కరోనా మరణాలు విషయంలో అగ్రస్థానంలో అమెరికా నిలవగా రెండో స్థానంలో బ్రెజిల్ ఉంది.
.