ప్రపంచ దేశాలు ఇండియా ని చూసి జాలి పడుతున్నాయి.కరోనా సెకండ్ వేవ్ సృష్టిస్తున్న విలయతాండవం ఇది చాలామంది ప్రజలు నేల రాలిపోతున్న పరిస్థితి ఉండటంతో .
ఇతర దేశాలు ఇండియాకి సాయం చేయడానికి ముందుకు వస్తున్నాయి.ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇండియాకి శత్రుదేశం గా అనబడే పాకిస్తాన్ కూడా .భారత్ కి సాయం అందిస్తామని ముందుకు రావటం విశేషం.పరిస్థితి ఇలా ఉండగా దేశంలో రోజురోజుకీ పెరుగుతున్న కేసులు మరియు మరణాలపై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది.
ఇలాంటి పరిస్థితిలో ఇండియాకి ప్రపంచ ఆరోగ్య సంస్థ అండగా ఉంటుందని ఎలాంటి సాయం అయినా చేయడానికి రెడీగా ఉన్నట్లు.డబ్ల్యూహెచ్వో చీఫ్ టేడ్రస్ అధానోం స్పష్టం చేశారు.
పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి వీలైనంత మేరకు శాయశక్తులా కృషి చేస్తాం అని భరోసా ఇచ్చారు.ఈ క్రమంలో 2600 మంది వైద్య నిపుణులు ఇండియాకి పంపుతున్నట్లు తెలిపారు.
వైద్య పరికరాలు మరియు ఆక్సిజన్ కొరత తీర్చడానికి కూడా సాయం చేస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి టేడ్రస్ అధానోం పేర్కొన్నారు.
.