ప్రతి దేశంలో స్థానికంగా కొన్ని ఆచారాలు, సంప్రదాయాలు ఉంటాయి.అలాంటి సంప్రదాయాలలో కొన్ని విచిత్రమైనవి కూడా ఉంటాయి.
వాటి గురించి విన్నప్పుడు ఇదెక్కడి ఆచారం అని అందరూ నవ్వుకుంటారు.కాని వారి ప్రాంతాలలో అలాంటి వింత ఆచారాలలో చాలా నిష్టతో చేస్తారు.
అలాగే ఇండియాలో కూడా కూడా చాలా ప్రాంతాలలో వింత వింత ఆచారాలు ఉన్నాయి.మన ప్రాంతంలో కూడా అలంటి ఆచారాలు ఉన్నాయి.
వాటిలో విశాఖ జిల్లా యలమంచిలి మండలం దివిలి గ్రామంలో బురద పండగ ఒకటి.
బురద పండగ ప్రత్యేకత ఏంటంటే ఆ పండగ రోజు మగవాళ్ళు అందరూ బురదలో దొర్లుతారు.
ఊళ్ళో ప్రతి మగాడు కచ్చితంగా బురద పూసుకుంటాడు.ఆ గ్రామంలో రెండేళ్ల కు ఒకసారి వచ్చే బురదమాంబ పండుగ చాలా ప్రత్యేకం.
ఊరిలో వున్న మురుగు కాలువల నీటీలో వేప కొమ్మలను ముంచి వాటిని ఒంటికి రాసుకుని పండుగ చేసుకంటారు.ఈ ఆచారం వెనుక ఓ కథ కూడా వుంది.
ఆ గ్రామంలో పూర్వ ఓ ఆర్ధరాత్రి కొంత మంది ఆకతాయిల నుంచి తప్పించుకుంటూ వచ్చి ఓ బురదగుంటలో దాక్కుంది.దానిని గమనించిన గ్రామస్తులు ఆమెని కాపాడే ప్రయత్నం చేసిన ఆమె భయంతో ఓ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.
తరువాత ఆ బురద గుంట అమ్మవారి విగ్రహం గ్రామస్తులకి దొరికింది.ఆ చనిపోయిన ఆమె అమ్మవారిగా వెలిసారని గ్రామస్తులు భావించి.
ఆ విగ్రహాన్ని ప్రతిష్టించి.ప్రతి రెండేళ్ళకి ఒక సారి బురదమాంబ పండగ చేసుకుంటారు.
ఆ రోజు మగవాళ్ళు అందరూ ఒంటికి బురద పూసుకొని సంబరాలు చేసుకుంటారు.