ఇటీవల కాలంలో టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ నటించినటువంటి వరల్డ్ ఫేమస్ లవర్ అనే చిత్రంలో తెలంగాణ యువతి సువర్ణ అనే పాత్రలో నటించిన తమిళ నటి ఐశ్వర్య రాజేష్ తెలుగు ప్రేక్షకులకి బాగానే గుర్తు ఉంటుంది.అయితే ఈచిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడినప్పటికీ సువర్ణ, సీనయ్యల పాత్ర మాత్రం ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయింది.
అయితే తాజాగా ఓ ప్రముఖ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూలో ఐశ్వర్య రాజేష్ పాల్గొంది.ఇందులో భాగంగా పలురకాల విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది.
అయితే ఇందులో భాగంగా తను ఇటీవల కాలంలో నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో సువర్ణ అనే పాత్ర అంటే తనకు చాలా ఇష్టమని అన్నారు.అంతేకాక తాను చూడడానికి పెద్దగా అందంగా లేకపోయినా తన నటన వల్లే ఆ పాత్రకే అందం వచ్చినట్లు చెప్పుకొచ్చింది ఈ అమ్మడు.
అంతేకాక తను నటించే సినిమాల్లోని కథల పరంగా కంటే తన పాత్రకి ప్రాధాన్యత ఉందా లేదా అని మాత్రమే ఆలోచిస్తానని అన్నారు.అందం ముఖ్యం కాదని ఆ పాత్రలకి మనం ఎంతవరకు న్యాయం చేసామన్నదే ముఖ్యమని అన్నారు.
అయితే ఇటీవల కాలంలో వరుస సినిమాల్లో నటిస్తూ ఇటు తెలుగు ప్రేక్షకులను అటు తమిళ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది ఈ అమ్మడు.తాజాగా బాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు వస్తున్నట్లు పేర్కొంది.
అయితే ప్రస్తుతం ఈ అమ్మడు న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న టువంటి టక్ జగదీష్ అనే చిత్రంలో నటిస్తోంది.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు.అంతేగాక ఈ అమ్మడు తమిళ్ లో దాదాపుగా ఐదు చిత్రాల్లోకి పైగా నటిస్తోంది.