ఇండియా క్రికెట్ హిస్టరీలో 2011 వరల్డ్కప్ ఎప్పటికి గుర్తుండిపోయే జ్ఞాపకం.ఈ వరల్డ్ కప్ సిరీస్ లలో ఇండియా అద్భుతంగా ఆది ఫైనల్ చేసింది.
సిరీస్ మొత్తం ఓపెనర్ గౌతమ్ గంభీర్ అద్భుతమైన ఫాం కొనసాగించాడు.ఇక ధోని కూడా కీలక సమయాలలో మ్యాచ్ లు గెలిపించారు.
ఇక ఫైనల్ మ్యాచ్ లో గౌతమ్ గంబీర్ ఓపెనర్ గా వచ్చి 90 పరుగులు చేసి బలమైన పునాది వేశాడు.ఈ గౌతమ్ వేసిన ఈ పునాది టీం ఇండియాకి చిరస్మరణీయమైన విజయాన్ని అందించింది.
అయితే ఈ ఫైనల్ మ్యాచ్ తర్వాత గౌతమ్ గంభీర్ ఇన్నింగ్స్ ని అందరూ మరిచిపోయారు.
ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ కి వచ్చి అద్బుతమైన బ్యాటింగ్ తో నిలకడగా ఆది టీం ఇండియాకి సిక్సర్ తో గెలుపు అందించిన ధోని ఇన్నింగ్స్ ని అందరూ గుర్తుంచుకున్నారు.
ఇక విన్నింగ్ సిక్సర్ ని అయితే చాలా మంది ప్రశంసించారు.అయితే ధోని కెప్టెన్సీ మీద ఎప్పుడు విమర్శలు చేసే గౌతమ్ గంబీర్ తాజాగా మరోసారి ధోని కొట్టిన విన్నింగ్ సిక్సర్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఆ సిక్సర్ ని గుర్తు చేస్తూ క్రిక్ఇన్ఫో చేసిన ట్వీట్ గంభీర్కు కోపం తెప్పించింది.క్రిక్ఇన్ఫోకు ఓ విషయం గుర్తు చేస్తున్నా.2011 వరల్డ్కప్ గెలిచింది యావత్ దేశం.మొత్తం ఇండియన్ టీమ్, స్టాఫ్ సపోర్ట్ వల్లే ఇది సాధ్యమైంది.
ఆ సిక్సర్పై మీకున్న వ్యామోహాన్ని వదులుకోవాల్సిన సమయం ఇది అని గంబీర్ ట్వీట్ చేశాడు.ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.