త్వరలో భారత పార్లమెంట్ ఎలక్షన్స్ రానున్నాయి.ఇక ఈ ఎన్నికలపై ప్రపంచ దేశాలన్నీ ప్రత్యెక ద్రుష్టి పెట్టాయి.
ఓ విధంగా చెప్పాలంటే ఈ ఐదు ఏళ్లలో మోడీ ప్రవేశ పెట్టిన ఆర్ధిక సంస్కరణలకి ప్రజల నుంచి 2019 ఎలక్షన్స్ ద్వారా తీర్పు వస్తుంది.ఇప్పటికైతే జాతీయ మీడియా సంస్థలు రానున్న ఎన్నికలలో ప్రజల తీర్పు మోడీకి అనుకూలంగా ఉండబోతుంది అనే చెబుతున్నాయి.
అయిన కూడా ప్రజలలో మోడీ వ్యతిరేకత బలంగా వుందని కాంగ్రెస్ పార్టీ విశ్వసిస్తుంది.ఇక రాహుల్ ప్రధాని కావడం ఎవరు ఆపలేరని బలంగా విశ్వసిస్తున్నాయి.
ఈ నేపధ్యంలో రానున్న ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనేది సర్వత్రా ఆసక్తి నెలకొని వుంది.
ఇదిలా వుంటే రాబోయే సార్వత్రిక ఎన్నికలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవిగా మారే అవకాశాలు వున్నాయని, విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇండియాలో ఎలక్షన్స్ అంటేనే డబ్బు ప్రవాహం ఎక్కువగా వుంటుంది.ప్రపంచ దేశాలన్నింటిలో కంటే ఇండియాలో ఎక్కువగా రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కోట్ల రూపాయిలు ఖర్చు చేస్తారు.అయితే ఈ ఏడాది ఈ ఖర్చు మరింత పెరిగే అవకాశం వుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.2014 ఎన్నికలలో ఇండియాలో సుమారు 35 వేల కోట్ల వరకు రాజకీయ పార్టీలు ఖర్చు పెట్టినట్లు తెలుస్తుంది.ఇక 2016లో అమెరికా ఎలక్షన్స్ ఈ రికార్డ్ ని అధికమించింది.ఇక రాబోయే 2019 ఎలక్షన్స్ అమెరికా రికార్డ్ ని కూడా అధికమింఛి ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఎన్నికలుగా మారే అవకాశం వుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
.