గిన్నీస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కివ అతిపెద్ద కుందేలు చోరీకి గురైంది.ఇంగ్లాండ్ వోర్సెస్టర్షైర్ లో రాత్రికి రాత్రి కుందేలుని అపహరించినట్టు తెలుస్తుంది.
కుందేలు మిస్సైన విషయాన్ని పోలీసులకు చెప్పి కంప్లైంట్ ఇచ్చారు ఆ కుందేలు యజమాని.అంతేకాదు కుందేలు ఆచూకి తెలిపిన వారికి బహుమతి అందిస్తానని ప్రకటించారు.డారియస్ పేరు గల కుందేలు.129 సెంటీమీటర్ల పొడవు ఉన్న తన కుందేలు అచూకి తెలిపిన వారికి లక్ష రూపాయల బహుమతి ప్రకటించింది ఆ యజమాని.
అయితే అయినా సరే ఎవరు ఆచూకి చెప్పకపోవడంతో ఆ పారితోషికాన్ని డబుల్ చేసింది.కుందేలు గురించి చెప్పిన వారికి వెతికి తెచ్చిన వారికి 2 లక్షలు రూపాయలు ఇస్తానని చెప్పింది.
ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.తను ప్రేమగా పెంచుకుంటున్న కుందేలుని ఎవరో అపహరించారని.వారిని పట్టుకుని తన కుందేలుని తన ఇప్పించాలని అంటున్నారు ఆ యజమానురాలు.ఈ వార్తతో పాటుగా ఆమె కుందేలుతో దిగిన ఫోటో కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
క్యూట్ గా ఉన్న కుందేలుని కొట్టేసింది ఎవరో అంటూ ఆమె పెట్టిన పోస్ట్ కు కామెంట్స్ కూడా విచిత్రంగా పెడుతున్నారు. కుందేలు దొరక్కపోతే మాత్రం ఆమె చాలా బాధపడుతుందని చెప్పొచ్చు.