ఉదయం నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఎన్నో ఒడిదొడుకుల కారణంగా తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు.ఆ ఒత్తిడే మనిషి పాలిట శాపంగా మారి ఆరో గ్యాన్ని చిత్తు చిత్తు చేసేస్తుంది.
అందుకే ఒత్తిడిని జయించడం ఎంతో అవసరం.అయితే అందుకు ధ్యానం సూపర్గా సహాయపడుతుంది.
ప్రతి రోజు కేవలం ఇరవై నిమిషాల పాటు ధ్యానం చేస్తే ఒత్తిడి పరార్ అవ్వడమే కాదు.బోలెడన్ని బెనిఫిట్స్ను సైతం పొందొచ్చు.
మరి లేటెందుకు ధ్యానం చేయడం వల్ల లభించే ప్రయోజనాలు ఏంటో చూసేయండి.
ప్రశాంతగా, శుభ్రంగా ఉండే ప్రదేశంలో నెలపై కూర్చుని ఇరవై నిమిషాల పాటు ధ్యానం చేస్తే మైండ్ రిలాక్స్ అవుతుంది.
ఆందోళన, అనవసరపు భయాలు దూరం అవుతాయి.ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలు తగ్గు ముఖం పడతాయి.
అలాగే ఈ మధ్య కాలంలో స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా చాలా మంది నిద్ర లేమితో తెగ సతమతమవుతున్నారు.అలాంటి వారు నిద్రించే ముందు ధ్యానం చేయాలి.ఇలా రెగ్యురల్గా చేస్తే మంచిగా నిద్ర పడుతుంది.
మతిమరుపు దరి చేరకుండా ఉంటుంది.మరియు అన్ని విషయాల్లోనూ సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వస్తుంది.
రెగ్యులర్గా ధ్యానం చేయడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ బల పడుతుంది.దాంతో తరచూ జబ్బుల బారిన పడకుండా ఉంటారు.ఒకవైళ ఏవైనా అనారోగ్య సమస్యలు వచ్చినా వెంటనే రికవర్ అవుతారు.
ఇక చిన్న చిన్న విషయాలకు కొందరు అరిచేస్తుంటారు, ఇంకొందరు చిరాకు పడతారు, మరికొందరు ఏడ్చేస్తుంటారు.
అయితే నిత్యం ఇరవై నిమిషాల పాటు ధ్యానం చేస్తే తమ భావోద్వేగాలను అదుపు చేసే శక్తి లభిస్తుంది.దాంతో కోపం, బాధ, సంతోషం, విషాదం వంటి భావోద్వేగాలన్నీ మీ ఆధీనంలోనే ఉంటాయి.