ప్రేమించాడు..పెళ్లికి పెద్దలు ఓకే అన్నాక ఎలా ప్లేట్ ఫిరాయించాడో తెలుసా.? చివరికి ఆ యువతి ఏం చేసిందంటే.?

ఏళ్ల తరబడి ప్రేమించుకుని తీరా పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి ప్రియుడు ముఖం చాటేయడంతో ప్రియురాలు అతని ఇంటి ఎదుట 41 రోజులు దీక్ష చేసి అనుకున్నది సాధించుకుంది.ఈ ఘటన వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఎల్కతుర్తి లో చోటుచేసుకుంది.

 Women Who Protested 41 Days Her Marriage With Lover-TeluguStop.com

వివరాలలోకి వెళ్తే.

శ్వేత, సుధీర్ కొద్ది సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు.అయితే పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి ముఖం చాటేస్తూ వచ్చాడు.తీరా పెద్దలు కూడా పెళ్ళికి ఓకే అన్న తర్వాత ప్లేటు ఫిరాయించాడు సుధీర్.

శ్వేత ఎంత బతిమాలినా కాదు పొమ్మన్నాడు.చివరకు ఆమె సుధీర్ ఇంటి ఎదుట బైఠాయించింది.

ఒక దశలో ఆత్మహత్యాయత్నం చేసింది.దీంతో మనసు మార్చుకున్న సుధీర్‌ పెళ్లికి అంగీకరించడంతో మంగళవారం కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం మత్చ్యగిరీంద్ర స్వామి గుడిలో ఆమెను వివాహం చేసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube