ఈ మధ్య కాలంలో కొందరు అడ్డ దారుల్లో డబ్బు సంపాదించాలని పన్నాగాలు పన్నుతూ ఏకంగా కటకటాల పాలవుతున్నారు.కాగా తాజాగా ఓ మహిళ దుబాయ్ నుంచి హైదరాబాద్ నగరానికి వస్తూ ఏకంగా 20 లక్షల రూపాయలు విలువ చేసే బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ ఎయిర్ పోర్ట్ అధికారులకు పట్టుబడిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే తాజాగా రాణి (పేరు మార్చాం) ఓ మహిళ దుబాయ్ నుంచి హైదరాబాద్ నగరానికి వస్తూ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అధికారులకు చిక్కింది.అయితే రాణి ని విచారించిన పోలీసులు పలు విస్తుపోయే నిజాలను కనుగొన్నారు.
ఇందులో భాగంగా రాణి ఏకంగా 20 లక్షల రూపాయలు విలువ చేసే బంగారాన్ని తన లో దుస్తులలో దాచి అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు కనుగొన్నారు.అయితే రాణి దుబాయ్ నుంచి వస్తూ పెద్ద మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేసి విమానంలో ప్రయాణం చేసింది.
కానీ అనుకోకుండా ఎయిర్ పోర్ట్ పోలీసుల చేతికి చిక్కడంతో ఆమెపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టారు.
ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడం కొత్త ఏమీ కాదు.
గతంలో కూడా పలుమార్లు కొందరు ఏకంగా తలకు పెట్టుకునే విగ్గులలో కూడా డబ్బులు, వజ్రాలు వంటివి అక్రమ రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు.దీంతో పోలీసులు ఈ ఘటనపై స్పందిస్తూ ఈ మధ్య కాలంలో ప్రజలు సినిమాలను చూసి దొంగతనాలు చేయడం చాలా ఈజీ గా ఉంటుందని భావిస్తున్నారని అది సరికాదని అంటున్నారు.
అంతేకాకుండా దొంగతనం కేసులో పోలీసులకు పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరిస్తున్నారు.