ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వాడుతున్నటువంటి వారిలో ఎక్కువమంది పబ్జి గేమ్ ని ఆడుతుంటారు.ఇందులోఆన్ లైన్ లో తెలియని వ్యక్తులని కూడా జట్టులో చేర్చుకొని ఆటని కొనసాగిస్తుంటారు.
అయితే తాజాగా ఈ పబ్జీ గేమ్ కారణంగా ఓ వివాహిత గ్యాంగ్ రేప్ కి గురైన ఘటన ముంబై ప్రాంతంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే భోపాల్ కి చెందిన ఓ మహిళకు అదే ప్రాంతానికి చెందిన టువంటి ఓ వ్యక్తితో ఈ మధ్యనే వివాహం అయింది.
ఆమె భర్త ఉద్యోగరీత్యా ఉదయం ఆఫీస్ కి వెళితే సాయంత్రం వరకు ఇంటికి వచ్చేవాడు కాదు.దీంతో ఆ మహిళ తరుచూ పబ్జి గేమ్ ఆడుతూ ఉండేది.అయితే ఈ క్రమంలో ఆమెకు గుజరాత్ కి చెందిన ఓ యువకుడితో పరిచయం అయింది.దీంతో వీరిద్దరూ ఎప్పుడూ పబ్జీ గేమ్ ఆడుతూ ఉండేవారు.
అయితే ఇది ఇలా ఉండగా ఒక రోజున ఆమె తనకు ముంబైలో ఏదైనా ఒక ఉద్యోగం చూడమని ఆ యువకుడిని అడిగింది.దీంతో అతడు ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ ఉంటుందని కాబట్టి వెంటనే ముంబైకి బయల్దేరి రమ్మని ఆమెను పిలిచాడు.
దీంతో ఆమె తన భర్తకు కూడా తాను ముంబై వెళ్తున్న విషయం చెప్పకుండా వెంటనే ముంబై కి వచ్చేసింది.అయితే ఇక్కడ వరకు అంతా బాగానే జరిగింది కానీ ఆమెని కలుసుకున్న యువకుడు మాత్రం ఆమెపై అత్యాచారం చేయడానికి పన్నాగం పన్నాడు.ఇందులో భాగంగానే మొదటగా ఆమెను కుర్లా ప్రాంతంలో ఉన్నటువంటి లాడ్జి తీసుకెళ్ళి ఆమెను బెదిరించి బలవంతంగా అత్యాచారం చేశాడు.ఆ తరువాత మరో ప్రాంతంలో ఉన్నటువంటి హోటల్ కి తీసుకెళ్లి తన స్నేహితులు ఇద్దరిని రమ్మని సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
అయితే ఇదిలా ఉండగా ఆమె భర్త బోపాల్ గోపాల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఓ పోలీస్ స్టేషన్ లో తన భార్య కనిపించడం లేదని కేసు నమోదు చేశాడు.దీంతో ఎలాగో విషయం తెలుసుకున్న నిందితుడు ఆమెని అక్కడి నుంచి వెళ్లిపోవాలని ప్రాధేయపడ్డాడు.
దాంతో ఆమె తన భర్తను కలుసుకుని జరిగిన విషయం చెప్పింది.దీంతో అతడు దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన భార్య పై జరిగినటువంటి అఘాయిత్యం గురించి ఫిర్యాదు నమోదు చేశాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
.