కేరళ పోలీసుల కళ్లు గప్పి జైలు గోడలు దూకి పారిపోయిన లేడీ దొంగలు

జైళ్ల నుంచి ఖైదీలు గోడలు దూకి పారిపోవడం సర్వసాధారణం.వారికి అవకాశం వస్తే పారిపోతారు అన్న సంఘటనలు చాలానే విన్నాం.

 Women Prisoners Escape From Jail In Kerala1-TeluguStop.com

అయితే ఇవన్నీ కూడా పురుష ఖైదీల గురించే ఎక్కువగా వింటూ ఉంటాం.పలానా జైలు నుంచి అంతమంది ఖైదీలు పారిపోయారు, ఇంతమంది ఖైదీలు పారిపోయారు అన్న ఘటనలు విన్నాం.

అయితే వాటికి భిన్నంగా మహిళా ఖైదీలు గోడ దూకి పారిపోయిన ఘటన కేరళ లో చోటుచేసుకుంది.కేరళ పోలీసులకే షాక్ కలిగించేలా ఇద్దరు మహిళలు జైలు గోడ దూకి మరి పరారయ్యారు.

తిరువనంతపురం పరిధిలోని జైలు లో ఈ ఘటన చోటుచేసుకుంది.

కేరళ పోలీసుల కళ్లు గప్పి జైలు

పారిపోయిన ఖైదీలను సంధ్య, శిల్పలుగా జైలు అధికారులు గుర్తించారు.పోలీసుల కళ్లు గప్పి వారిద్దరూ జైలు గోడ దూకి పారిపోయినట్లు తెలుస్తుంది.దొంగతనం కేసులో శిల్ప నేరస్తురాలు కాగా, మోసం చేసిన కేసులో సంధ్య శిక్ష అనుభవిస్తున్నారు.

అయితే ఉన్నట్టుండి జైలు నుంచి పారిపోవడం తో వీరిద్దరి కోసం ప్రస్తుతం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube